ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం: జమ్మూకాశ్మీర్కు సత్యపాల్
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్గా బేబీ రాణి మౌర్య, హర్యానా గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య నియమితులయ్యారు.
బీహార్ గవర్నర్గా లాల్జీ టాండన్, జమ్మూకాశ్మీర్ గవర్నర్గా బిహార్ గవర్నర్గా పనిచేస్తున్న సత్యపాల్ మాలిక్ను నియమించారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా పదవీకాలం జూన్ 28నే ముగియడంతో సత్యపాల్ను నియమించారు.

సిక్కిం గవర్నర్గా మేఘాలయ గవర్నర్ పనిచేస్తున్న రంగా ప్రసాద్ బదిలీ అయ్యారు. మేఘాలయ గవర్నర్గా త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ బదిలీ నియమితులయ్యారు. త్రిపురకు.. హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకిని బదిలీచేశారు.












Click it and Unblock the Notifications