షాకింగ్ : 'ఏటీఎం'ల పూర్తి స్థాయి కార్యకలాపాలకు మరో 10రోజులు
న్యూఢిల్లీ : సామాన్యుల కొత్త నోట్ల తిప్పలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈరోజు ఉదయాన్నే ఏటీఎంలు తెరుస్తారని అంతా భావించినా.. ఉదయం చాలాసేపటిదాకా పలు ఏటీఎంలు మూసే దర్శనమివ్వడంతో.. చాలామంది తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు బ్యాంకుల్లో విపరీతమైన రద్దీతో పాటు సిబ్బందితో గొడవలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన ఎస్బీఐ ఛైర్మన్.. పూర్తి స్థాయిలో ఏటీఎం కార్యకలాపాలు అందుబాటులోకి రావాలంటే మరో 10రోజులు ఆగాల్సిందేనని చెబుతున్నారు. మరికొన్ని బ్యాంకులు అధికారులు కూడా దీనిపై స్పందించారు. మరో రెండు రోజుల్లో కొత్త నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని.. ఆ తర్వాతే ఏటీఎంలలో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా, పలుచోట్ల సాంకేతిక సమస్యలతో ఏటీఎంలు పనిచేయకపోవడం కూడా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications