వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకును కిడ్నాప్ చేసి భార్యను చంపేశారు

|
Google Oneindia TeluguNews

ముంబై: భార్యను హత్య చేసి కుమారుడిని కిడ్నాప్ చెయ్యడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఇద్దరు ఒకే సారి దూరం కావడంతో అతను షాక్ కు గురైనాడు. ముంబై నగరంలో ఈ దారుణం జరిగింది.

ముంబైలోని నల్లషోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబాల దేవ్ నాథ్ (27) నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య గత్కి సింగ్ (25), దేవ్ నాథ్ కు ప్రకాష్ (7) అనే కుమారుడు ఉన్నాడు. భార్య, కుమారుడు అంటే దేవ్ నాథ్ కు ప్రాణం.

కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియనివ్యక్తులు దేవ్ నాథ్ కు ఫోన్ చేశారు. నీ కొడుకును కిడ్నాప్ చేశామని రూ. 1.50 లక్షలు ఇస్తే వదిలిపెడుతామని లేదంటే చంపేస్తామని బెదిరించారు.

Seven-year-old boy kidnapped in Mumbai

పోలీసులకు చెబితే నీ కొడుకు శవం కూడ చిక్కదని హెచ్చరించారు. హడలిపోయిన దేవ్ నాథ్ కార్యాలయం నుండి ఇంటికి పరుగు తీశాడు. భార్య నగలు తాకట్టు పెట్టి కుమారుడిని రక్షించుకోవాలని అనుకున్నాడు. అయితే ఇంటికి వెళ్లి చూడగా అతని భార్య మంచం మీద పడి ఉన్న విషయం గుర్తించాడు.

భార్య గత్కి సింగ్ ను గొంతునులిమి హత్య చేశారని తెలుసుకుని కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దేవ్ నాథ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్ ను కిడ్నాప్ చేసిన వారే గత్కి సింగ్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

English summary
According to the Nallasopara police, Ambala Devnath (27) received the ransom call around 7 pm yesterday. The caller said that his son, Prakash (7), had been kidnapped and demanded R1.5 lakh to free him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X