జారిపడిన శరద్ పవార్: ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలింపు
న్యూఢిల్లీ: ఎన్సీపి చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మార్నింగ్ వాక్ చేస్తూ బుధవారం ఉదయం జారి పడ్డారు. ఈ సంఘటన ఆయన నివాసంలో జరిగింది. ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. 73 ఏళ్ల పవార్ కాలికి గాయమైంది. వీపు భాగంలో కూడా గాయమైనట్లు తెలుస్తోంది. ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చారు.
భార్య ప్రతిభ, కూతురు సుప్రియా సూలే ఆయన వెంట ఉన్నారు. జనపథ్ బంగళాలో దైనందిన కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తుండగా జారిపడ్డారు. ఆయన పరిస్థితిపై వివరాలు తెలియడం లేదు. కాంగ్రెసుకు రాజీనామా చేసిన శరద్ పవార్ 1999లో ఎన్సిపీని స్థాపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఆయన మూడు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యుపిఎ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications