జారిపడిన శరద్ పవార్: ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలింపు
న్యూఢిల్లీ: ఎన్సీపి చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మార్నింగ్ వాక్ చేస్తూ బుధవారం ఉదయం జారి పడ్డారు. ఈ సంఘటన ఆయన నివాసంలో జరిగింది. ఆయనను ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. 73 ఏళ్ల పవార్ కాలికి గాయమైంది. వీపు భాగంలో కూడా గాయమైనట్లు తెలుస్తోంది. ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చారు.
భార్య ప్రతిభ, కూతురు సుప్రియా సూలే ఆయన వెంట ఉన్నారు. జనపథ్ బంగళాలో దైనందిన కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తుండగా జారిపడ్డారు. ఆయన పరిస్థితిపై వివరాలు తెలియడం లేదు. కాంగ్రెసుకు రాజీనామా చేసిన శరద్ పవార్ 1999లో ఎన్సిపీని స్థాపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఆయన మూడు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యుపిఎ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు.












Click it and Unblock the Notifications