సునంద కేసు: చూస్తున్నానని థరూర్, స్వామి ఆరోపణ
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసు దర్యాఫ్తు పైన ఢిల్లీ పోలీసులను మొదట్లోనే తాను నివేదికను అడిగానని, దీని పైన వారి నుండి ఇంకా సమాధానం రాలేదని మాజీ కేంద్రమంత్రి, తిరునంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ శనివారం చెప్పారు. నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.
తన తల్లి మరణం పైన దర్యాఫ్తును త్వరితగతిన పూర్తి చేయాలని సునంద పుష్కర్ తనయుడు శివ్ పుష్కర్ మీనన్ పోలీసులను కోరాడు. సునంద పుష్కర్ మృతి కేసులో తీసుకున్న చర్యల పైన నివేదిక సమర్పించాలని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు
సునంద పుష్కర్ మృతికి ముందు రోజు శశిథరూర్ తన భార్య పట్ల వయోలెంట్గా ప్రవర్తించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం ఆరోపించారు. కుంభకోణాలలో ఉన్న వారి పేర్లు బయటపెడతానని సునంద భర్తను హెచ్చరించిందని ఆయన అన్నారు.
సునంద ఆస్తులు తీసుకోలేదు: శశిథరూర్
సునంద పుష్కర్ మృతి అనంతరం ఆమెకు చెందిన ఆస్తులను తాను ఏవీ తీసుకోలేదని శశిథరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. శశిథరూర్ తరఫు న్యాయవాది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సునంద పుష్కర్ కెనెడియన్ సిటిజన్ అని, కెనెడియన్ చట్టాల ప్రకారం.. భార్య ఆస్తులు భర్తకు వారసత్వంగా రావని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో శశిథరూర్ సునంద ఆస్తులను ప్రకటించలేదని పిటిషన్ దాఖలైంది. దాని పైన పైవిధంగా శశిథరూర్ స్పందించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications