సునంద కేసు: చూస్తున్నానని థరూర్, స్వామి ఆరోపణ
న్యూఢిల్లీ: తన భార్య సునంద పుష్కర్ మృతి కేసు దర్యాఫ్తు పైన ఢిల్లీ పోలీసులను మొదట్లోనే తాను నివేదికను అడిగానని, దీని పైన వారి నుండి ఇంకా సమాధానం రాలేదని మాజీ కేంద్రమంత్రి, తిరునంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ శనివారం చెప్పారు. నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.
తన తల్లి మరణం పైన దర్యాఫ్తును త్వరితగతిన పూర్తి చేయాలని సునంద పుష్కర్ తనయుడు శివ్ పుష్కర్ మీనన్ పోలీసులను కోరాడు. సునంద పుష్కర్ మృతి కేసులో తీసుకున్న చర్యల పైన నివేదిక సమర్పించాలని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు
సునంద పుష్కర్ మృతికి ముందు రోజు శశిథరూర్ తన భార్య పట్ల వయోలెంట్గా ప్రవర్తించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం ఆరోపించారు. కుంభకోణాలలో ఉన్న వారి పేర్లు బయటపెడతానని సునంద భర్తను హెచ్చరించిందని ఆయన అన్నారు.
సునంద ఆస్తులు తీసుకోలేదు: శశిథరూర్
సునంద పుష్కర్ మృతి అనంతరం ఆమెకు చెందిన ఆస్తులను తాను ఏవీ తీసుకోలేదని శశిథరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు. శశిథరూర్ తరఫు న్యాయవాది హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. సునంద పుష్కర్ కెనెడియన్ సిటిజన్ అని, కెనెడియన్ చట్టాల ప్రకారం.. భార్య ఆస్తులు భర్తకు వారసత్వంగా రావని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో శశిథరూర్ సునంద ఆస్తులను ప్రకటించలేదని పిటిషన్ దాఖలైంది. దాని పైన పైవిధంగా శశిథరూర్ స్పందించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications