యాకుబ్ మెమన్ ఉరి బాధ కలిగించింది: శశిథరూర్
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ మరణశిక్ష తనను బాధించిందని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అన్నారు. మెమన్కు మరణశిక్ష అమలు చేయడంపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
మెమన్ ఉరితీత తనకు బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. 'మన ప్రభుత్వం ఒక మనిషిని ఉరి తీసిందనే వార్త తనను చాలా బాధపెట్టింది. మరణదండన వల్ల ప్రతికూల ఫలితాలే తప్ప సానుకూల ఫలితాలు వచ్చిన దాఖలాలేమీ లేవు' అని ట్విట్ చేశారు.

క్రూరమైన ఉరితీతలు ఉగ్రవాదాన్ని నిలువరించలేకపోయాయని శశిథరూర్ వ్యాఖ్యానించారు. కక్షసాధింపు చర్య, ప్రతీకార హత్య తప్ప మరొకటి కాదన్నారు. ఇది ప్రభుత్వ వైఫ్యలమనీ, ప్రభుత్వం చేసిన హత్య అంటూ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా, శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. థరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో నాగపూర్ జైల్లో గురువారం ఉదయం యాకూబ్ మెమన్ను ఉరితీసిన విషయం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications