ఎన్నికలకు ముందు మత కల్లోలాలు చెలరేగవచ్చు..జర జాగ్రత్త
ముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులపై కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు, పార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ దాడులు జరగడం వెనుక తమకు అనేక సందేహాలు ఉన్నాయని, ఉద్దేశపూరకంగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అంటూ పశ్చిమ బెంగాల్, ఏపీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీన్ని ఆధారంగా చేసుకుని శివసేన కూడా ఓ ప్రకటన చేసింది. బీజేపీని ఉద్దేశించి కాకుండా, అన్ని రాజకీయ పార్టీలు కూడా మత కల్లోలాలు, దాడులకు అవకాశం కల్పిస్తాయనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ దినపత్రిక సామ్నా లో ఓ కథనాన్ని ప్రచురించింది.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన మరుసటి రోజే ఈ కథనం వెలువడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్దిని పొందడానికి కొన్ని పార్టీలు మత కల్లోలాలకు పాల్పడవచ్చని, దాడులు చేయడానికి కుట్ర పన్నవచ్చని శివసేన పేర్కొంది. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని శివసేన ఈ కథనం రాసినట్లు చెబుతున్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ఈ తరహా ఆలోచన చేయడానికి పుల్వామా ఉగ్రవాద దాడి ఆస్కారం ఇచ్చినట్టయిందని పేర్కొంది. పుల్వామా దాడుల అనంతరం పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను శివసన తన కథనంలో పరోక్షంగా ఉటంకించింది. బీజేపీ ఎమ్మెల్యే నేపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే..కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఎలాంటి ఘాతుకాలకైనా పాల్పడే ప్రమాదం లేకపోలేదని శివసన తన అనుమానాన్ని వ్యక్తం చేసింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications