వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత చేసినా ఓడించారు: సిద్ధరామయ్య కన్నీటిపర్యంతం, సీనియర్ నేతల విమర్శలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నికల్లో ఓటమిపై భావోద్వేగానికి గురయ్యారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్‌ చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదంటూ సిద్ధరామయ్య కన్నీటి పర్యంతమయ్యారు.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీ ముందున్న మార్గాలివే! కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు: బీజేపీ ముందున్న మార్గాలివే!

బుధవారం బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో సిద్ధరామయ్య తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నా.. ఫలితం మాత్రం మరోలా వచ్చిందని అన్నారు.

Siddaramaiah gets emotional at MLAs’ meet, senior leaders blame him for defeat

ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం మమ్మల్ని ఓడించారని ఆవేదన చెందారు. తమ ప్రణాళికను ప్రజలే మార్చేశారని ఉద్వేగానికి లోనయ్యారు.

రంగంలోకి రెడ్డి బ్రదర్స్: బీజేపీ కొత్త వ్యూహంతో కాంగ్రెస్, జేడీఎస్ చిత్తేనా? రంగంలోకి రెడ్డి బ్రదర్స్: బీజేపీ కొత్త వ్యూహంతో కాంగ్రెస్, జేడీఎస్ చిత్తేనా?

రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్‌, దళ్‌ శాసనసభ్యులెవరూ బీజేపీలోకి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్ధరామయ్యే కారణమంటూ పలువురు సీనియర్ నేతలు విమర్శలు చేస్తుండటం కూడా ఆయనను వేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది.

English summary
Outgoing Chief Minister Siddaramaiah turned “emotional” at a meeting of the party’s new legislators today while speaking on Congress’ defeat in the assembly polls even as senior leaders blamed him for the result, party sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X