ఆఫ్ఘనిస్తాన్ లో ఆరుగురు ఇండియన్స్ కిడ్నాప్
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం నాడు ఉదయం ఆరుగురు భారతీయులు కిడ్నాప్కు గురయ్యారు. ఆదివారం నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉదయం పూట తాలిబన్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు ఆరుగురు ఇండియన్లను కిడ్నాప్ చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్లాహన్ రాష్ట్రంలో ఆరుగురు భారతీయులను కిడ్నాప్ చేసినట్టు ఆప్ఘనిస్థాన్ లోని మీడియా సంస్థలు ప్రకటించాయి. కిడ్పాప్ కు గురైన వారంతా ఇండియాకు చెందిన వారేనని ఆ మీడియా సంస్థ ప్రకటించింది.
మరో వైపు ఆఫ్ఘనిస్తాన్ లోని ఓ కంపెనీలో పనిచేసేందుకు వెళ్ళిన భారతీయులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు కిడ్నాప్కు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నాప్కు గురైన వారు ఎక్కడివారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ఇంకా వివరాలు అందాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భారతీయుల కిడ్నాప్ కు సంబంధించి అక్కడి ప్రభుత్వం కూడ ధృవీకరించింది.