మళ్లీ రెచ్చిన పాకిస్తాన్, అమరుడైన భారత జవాన్
జమ్ము: భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆదివారం నాడు మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాక్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా, తెల్లవారుజాము నుంచి యథేచ్చగా కాల్పులకు పాల్పడుతోంది.
పూంచ్ జిల్లాలోని కేజీ (కృష్ణ గతి ఏరియా) సెక్టార్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు మృతి చెందారు. పాకిస్తాన్ కాల్పులకు భారత్ ధీటుగా జవాబిస్తోంది. యూరి ఘటన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
కేజీ సెక్టారులోని సాలోత్రి, సాగ్రా ప్రాంతాలను పాకిస్తాన్ ట్రూప్స్ ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు. గత రెండు వారాల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కారణంగా ఎనిమిది మంది జవాన్లు మృతి చెందారు. పాక్ దురాఘతానికి గత వారం ఎనిమిది మంది సామాన్యులు కూడా మృతి చెందారు.