"ఉపాధి హామీ పథకంపై మోదీ సర్కార్ బుల్డోజర్ ప్రయోగం"
దేశంలోని కోట్లమంది గ్రామీణ ప్రజల ఉపాధిని పెంచేందుకు వీలుగా 2005 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) చట్టం పేరును తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)'.. సంక్షిప్తంగా వికసిత్ భారత్ - జీ రామ్ జీ బిల్లు అని పెట్టడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి.
అయితే తాజాగా ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. కోట్లాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్యగా ఈ చట్టాన్ని ఆమె అభివర్ణించారు. పేదలకు జీవనాధారంగా ఉపాధి హామీ పథకం ఉందన్నారు. గత 11 ఏళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చేలా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పేదలకు ఈ పథకం జీవనాధారంగా మారిందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో స్టేట్ మెంట్ ను రిలీజ్ చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పైనా మోదీ ప్రభుత్వం బుల్డోజర్ ను ప్రయోగించిందని సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. గ్రామీణ పేదలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టం తెచ్చేందుకు కుట్ర చేస్తోందని వివరించారు. ఈ బ్లాక్ లా పై పోరాటం చేసేందుకు ఈ మేరకు అందరూ సిద్ధంగా ఉండాలని సోనియాగాంధీ చెప్పుకొచ్చారు.
कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी: मोदी सरकार ने मनरेगा पर बुलडोजर चलाया, नए काले कानून' के खिलाफ हमारा संघर्ष जारी रहेगा#soniagandhi #MGNREGA #politics #congress @INCIndia #nationalheraldcase #Karnataka #breakingnews #jantv #jantv_bm #news pic.twitter.com/YU2iJqEDZn
— JAN TV (@JANTV2012) December 20, 2025
ఈ విషయాన్ని వీడియో స్టేట్ మెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేసింది. ఇటీవల పార్లమెంట్ లో 'వీబీ- జీ రామ్ జీ బిల్లు 2025'ను ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ ఆమోదించింది. ఈ చట్టంలో భాగంగా నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామీణ కుటుంబ సభ్యులకు ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధికి చట్టపరమైన హామీని కల్పిస్తుంది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications