అట్టుడికిన యూపీ.. ఎస్పీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు.. బీజేపీపై దీదీ, చంద్రబాబు గుస్సా
లక్నో : మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను మంగళవారం లక్నో విమానాశ్రయంలో అడ్డుకున్న దరిమిలా ఉత్తర్ ప్రదేశ్ అట్టుడికిపోయింది. సమాజ్వాదీ పార్టీ కార్యకర్తల నిరసనలతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ, ఎస్పీ మధ్య వార్ మరింత ముదిరినట్లైంది. అలహాబాద్ యూనివర్శిటీలో విద్యార్థినేత ప్రమాణస్వీకారానికి వెళుతున్న తనను అడ్డుకోవడం సరికాదని మండిపడుతున్నారు అఖిలేశ్. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో.. కేంద్రం కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. అఖిలేశ్ ను అధికారులు అడ్డుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి.

భగ్గుమన్న కార్యకర్తలు.. లాఠీలు ఝలిపించిన పోలీసులు
లక్నో విమానాశ్రయంలో అధికారులు తనను అడ్డుకోవడంపై మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ గుర్రుగా ఉన్నారు. కుంభామేళాతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని చెప్పినా.. అధికారులు వినిపించుకోలేదని ఫైరవుతున్నారు. అదలావుంటే అఖిలేశ్ ను అడ్డుకోవడంతో ఎస్పీ కార్యకర్తలు అసెంబ్లీ సముదాయంతో పాటు విమానాశ్రయం దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ప్రయాగ్రాజ్లో ఎంపీ ధర్మేంద్ర యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు లాఠీలు ఝలిపించారు. ఆ క్రమంలో ధర్మేంద్ర యాదవ్ కు గాయాలయ్యాయి. గోరఖ్పూర్లో నిరసనకు దిగిన ఎస్పీ కార్యకర్తలు.. కొన్ని వాహనాల అద్దాలను ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయి దాటింది.

చట్టసభల్లో రచ్చ రచ్చ.. దీదీ చురక
అఖిలేశ్ యాదవ్ ను అడ్డుకున్న తీరు సరికాదంటూ ఎస్పీ, బీఎస్పీ ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. అసెంబ్లీతో పాటు శాసనమండలిలో నిరసన గళం వినిపించారు ఆ పార్టీల సభ్యులు. దీంతో రెండు సభలు దద్ధరిల్లిపోయాయి. సమాజ్ వాదీ సభ్యులు రాజ్భవన్కు చేరుకుని ధర్నాకు దిగారు. అఖిలేశ్తో పాటు ఎమ్మెల్యే జిజ్ఞేశ్ మేవానీని కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దురహంకారంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

అఖిలేశ్ కు చంద్రబాబు ఫోన్
లక్నో విమానాశ్రయంలో అఖిలేశ్ యాదవ్ ను అడ్డుకోవడాన్ని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అఖిలేశ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని ఆరోపించారు. యూపీ ప్రభుత్వం అనుసరించిన విధానం సరికాదని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇదంతా కూడా బీజేపీ అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications