కర్ణాటకలోనూ ఓటుకు నోటు: పట్టుబడ్డ ఎమ్మెల్యేలు(పిక్చర్స్)

బెంగళూరు: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మె ల్యేల బేరసారాల జోరుగా సాగుతున్నాయి. కాగా, ఓ ఛానల్‌ రహస్యంగా నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల తెలంగాణలో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసు మాదిరిగానే ఇక్కడ కూడా జరిగింది.

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ స్వతంత్ర్య ఎమ్మెల్యేలతో కాంగ్రెస్, జేడీఎస్ ఈ బేరసారాలు సాగించినట్లు తెలుస్తోంది. రూ. 5 కోట్లు ఇస్తే ఓటేసేందుకు సిద్ధమని నలుగురు ఎమ్మెల్యేలు ఆఫర్‌ ఇచ్చినట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు మీడియాలో సంచలనం రేపుతోంది.

స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్‌, ఒకరు కేజీపీకి చెందిన వారు కాగా, మరొకరు ఇండిపెండెంట్‌. జేడీఎస్‌కు చెందిన చాముండేశ్వరి ఎమ్మెల్యే జిటి దేవెగౌడ, బసవకల్యాణకు చెందిన మల్లికార్జున ఖూబా, కేజీపీకి చెందిన ఆళంద ఎ మ్మెల్యే బిఆర్‌ పాటిల్‌, కోలారుకు చెందిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్‌ ఈ స్టింగ్‌లో దొరికిపోయారు.

ఇది జేడీఎస్‌ కుట్రలో భాగమని ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ ఆరోపించారు. ఓ పార్టీలో తమాషాగా తాను ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్‌ అన్నానని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని కేజీపీ ఎమ్మెల్యే పాటిల్‌ చెప్పారు.

కాగా, ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలకు రూ.100కోట్ల వరకు ఇచ్చేందుకు సిద్ధమని జేడీఎస్‌ అభ్యర్థి ఫరూక్‌ అన్నట్లు తేలడంతో.. ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మె ల్యేల బేరసారాల జోరు సాగుతున్నాయి. కాగా, ఓ ఛానల్‌ రహస్యంగా నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల తెలంగాణలో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసు మాదిరిగానే ఇక్కడ కూడా జరిగింది.

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ స్వతంత్ర్య ఎమ్మెల్యేలతో కాంగ్రెస్, జేడీఎస్ ఈ బేరసారాలు సాగించినట్లు తెలుస్తోంది

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

రూ. 5 కోట్లు ఇస్తే ఓటేసేందుకు సిద్ధమని నలుగురు ఎమ్మెల్యేలు ఆఫర్‌ ఇచ్చినట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు మీడియాలో సంచలనం రేపుతోంది.

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్‌, ఒకరు కేజీపీకి చెందిన వారు కాగా, మరొకరు ఇండిపెండెంట్‌. జేడీఎస్‌కు చెందిన చాముండేశ్వరి ఎమ్మెల్యే జిటి దేవెగౌడ, బసవకల్యాణకు చెందిన మల్లికార్జున ఖూబా, కేజీపీకి చెందిన ఆళంద ఎ మ్మెల్యే బిఆర్‌ పాటిల్‌, కోలారుకు చెందిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్‌ ఈ స్టింగ్‌లో దొరికిపోయారు.

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

కర్ణాటకలోనూ ఓటుకు నోటు

ఇది జేడీఎస్‌ కుట్రలో భాగమని ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ ఆరోపించారు. ఓ పార్టీలో తమాషాగా తాను ఈ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్‌ అన్నానని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని కేజీపీ ఎమ్మెల్యే పాటిల్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+