Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా మేడమ్ కు సీటు ఇస్తే ఓకే, సీటు ఇవ్వకున్నా పోటీ మాత్రాం గ్యారెంటి, సుమలత ఫ్యాన్స్ ధీమా !

సిట్టింగ్ ఎంపీ సుమలతా అంబరీష్ మళ్లీ మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆమె సన్నిహితుడు హనకెరె శశికుమార్ తెలిపారు. మండ్యలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంటుందన్న నమ్మకం మాకు ఉందని అన్నారు.

నాలుగేళ్లుగా సుమలతా అంబరీష్ మండ్య లోక్ సభ నియోజక వర్గంలో చాలా అభివృద్ధి చేశారని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ సుమలతా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని శశికుమార్ చెప్పారు. మైషుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంలో సుమలతా అంబరీష్ విజయం సాధించారని, కేఆర్ఎస్ డ్యామ్ చుట్టూ అక్రమ మైనింగ్‌పై పోరాటం చేసి అక్రమ మైనింగ్ ను మూసివేయించడంతో సుమలతా అంబరీష్ ముందున్నారని అన్నారు.

Sumalata Ambarishs followers are confident that she will contest from Mandya Lok Sabha constituency.

అత్యధికంగా దిశా సమావేశాలు నిర్వహించిన ఘనత సుమలతా అంబరీష్ కు మాత్రం సొంతం అయ్యిందని శశికుమార్ వివరించారు. సుమలతా అంబరీష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చారని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో మండ్య లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ నాయకులు జేడీఎస్‌కు వదులుకుంటారనే చర్చ జరుగుతోంది.

సుమలతా ఇప్పటికీ బీజేపీ సభ్యురాలు కాదు, పార్టీయేతర ఎంపీగానే ఉన్నారు. సుమలతా అంబరీష్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మేం సపోర్ట్ చేస్తామని, మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు వదులుకున్నా సుమలత అంబరీష్‌ పోటీ చెయ్యడం ఖాయం అని ఆమెకు గట్టి మద్దతుదారుడు శశికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండ్యలో ఆధిక్యాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. అవసరమైతే మండ్య నియోజకవర్గాన్ని సుమలతా నిలబెట్టుకుంటారన్న నమ్మకం మాకు ఉందని శశికుమార్ అన్నారు.

బీజేపీ నాయకులు మండ్య లోక్ సభ నియోజక వర్గాన్ని జేడీఏకు వదిలేసినా సుమలతా మాత్రం పోటీ చెయ్యడం ఖాయం అని ఆమె మద్దతుదారులు అంటున్నారు. అయితే ఆధిక్యాన్ని నిలుపుకోగలమన్న విశ్వాసంతో బీజేపీ ఉంది. ఓల్డ్ మైసూర్‌లో బలమైన బీజేపీని నిర్మించాలనే తపన ఉంటే, అవసరమైతే సుమలతాను మండ్య నుంచి పోటీ చేయించాలని ఆమె మద్దతుదారులు బీజేపీ హైకమాండ్ కు మనవి చేస్తున్నారు.

Sumalata Ambarishs followers are confident that she will contest from Mandya Lok Sabha constituency.

గతంలో సుమలతా భర్త అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజకీయాల్లో మార్పులు సహజం, తరువాత సుమలతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇఫ్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వెళ్లిపోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది, అయితే మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలతాను మళ్లీ పోటి చేయించాలని ఆమె మద్దతుదారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+