వేసవిలో ఈ చల్లని ప్రాంతాలకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా..
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలకు దాదాపు నెల రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. అయితే వేసవిలో చాలామంది వివిధ ప్రాంతాలకు టూర్ లకు వెళ్తుంటారు. మరికొంతమంది విదేశాలకూ వెళ్తుంటారు. ఎండల ధాటికి తట్టుకునేందుకు చాలామంది పర్యటకులు హిల్ స్టేషన్స్, మంచు కొండల్లో విహరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి ఆ ప్రాంతాలు ఏంటి..? ఆ వివరాలు ఏంటి ఇక్కడ చూద్దాం..?
ఓవైపు ఎండలు ముదురుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు రాకముందే మార్చిలోనే వేసవి ఉష్ణోగ్రతలు అధికం అవుతున్నాయి. ఈ మండు వేసవిని తట్టుకునేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్తుంటారు. అలా పర్వతాలు, అడవులు, వ్యాలీలు.. ఇలా హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాదిలోని కాఫీ, టీ తోటలు, హిల్ స్టేషన్స్ వరకూ చాలా పర్యటక ప్రాంతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి.
వేసవిలో లద్దాఖ్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నిలుస్తోంది. లద్దాఖ్ ను ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పిలుస్తుంటారు. లద్దాఖ్ కు లేహ్, కార్గిల్ ఉమ్మడి రాజధానులుగా ఉన్నాయి. లద్దాఖ్.. భౌగోళికంగా ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంగా ఉంది. ఇక్కడి ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సు, నుబ్రా వ్యాలీ, ప్రపంచంలోనే ఎత్తయిన మోటరబుల్ రోడ్డు ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్.. పర్యటకులను ఆకర్షించే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఉంది. తవాంగ్ ను సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతంగా చెబుతారు. ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బౌద్ధమఠం నెలకొని ఉంది. ఇక్కడి నురనాంగ్ జలపాతాన్ని జంగ్ ఫాల్స్ అని కూడా పిలుస్తుంటారు.
హిమాచల్ ప్రదేశ్ లోని స్పిటి వ్యాలీ కోల్డ్ డెజర్ట్ గా పేరుగాంచింది. ఇది భారత్- టిబెట్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధ బౌద్ధమఠం అయిన కీ మోనాస్టరీ ఉంది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశాలు హిక్కిం, కోమిక్, చిచం బ్రిడ్జి ఇక్కడి ప్రాంతంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే చంద్రతాల్ సరస్సు కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది.
అలాగే వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతం ప్రముఖ పర్యటక ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా పిలుస్తుంటారు. ఇక్కడి అకాల హిమపాతం, డార్జిలింగ్ కొండలు, కాంచనగంగ పర్వత శిఖరాలు కనువిందు చేస్తుంటాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టైగర్ హిల్, బతాసియా లూప్ ముఖ్యమైన ప్రాంతాలుగా ఉంటాయి.

కేరళలోని మున్నార్.. పశ్చిమ కనుమల్లో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రాంతాన్ని సౌత్ కాశ్మీర్ గా పిలుస్తుంటారు. కేరళలో ఎండలు ఉన్నప్పటికీ మున్నార్ లో వాతావరణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి అరుదైన నీలకురుంజి పూలు 12 ఏళ్లకు ఓసారి పూస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని చూసేందుకు చాలా మంది పర్యటకులు క్యూ కడుతుంటారు. అలాగే కర్ణాటకలోని కూర్గ్, ఉత్తరాఖండ్ లోని ఔళీ, మేఘాలయాలోని షిల్లాంగ్ పర్యటక ప్రాంతాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications