ఈడీ ఛీఫ్ పదవీకాలం పొడిగింపుకు సుప్రీంకోర్టు ఓకే ! విపక్షాలకు మరో బ్యాడ్ న్యూస్ ?
దేశంలో విపక్షాలకు కంటగింపుగా మారిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ప్రస్తుతం ఛీఫ్ గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రాకు మరోసారి పదవీకాలం పొడిగిస్తూ గతంలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు ఇవాళ దాన్ని సవరించింది.
ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కీలక కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకూ ఈడీ ఛీఫ్ పదవీకాలం పొడిగింపుకు అనుమతివ్వాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మన్నించింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఎస్కె మిశ్రా ఈ నెలాఖరుతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే దీన్ని సెప్టెంబర్ 15 వరకు కొనసాగవచ్చని సుప్రీం కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ ఛీఫ్ పదవీకాలం గడువును అక్టోబర్ వరకు పొడిగించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈడీ ఛీఫ్ ఎస్కే మిశ్రా రెండవ, మూడవ పొడిగింపును చట్టవిరుద్ధంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. కేంద్రం అసాధారణ పరిస్థితులున్నాయని చేసిన వాదనతో ఇవాళ మాత్రం ఏకీభవించింది.

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) ద్వారా వస్తున్న సమీక్షల దృష్ట్యా మిశ్రాను కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాదించారు. మనీలాండరింగ్ను ఎదుర్కోవడానికి కూడా పోరాడే అంతర్ ప్రభుత్వ సంస్ధ ద్వారా భారతదేశ నిబంధనలు, పర్యవేక్షణ సమీక్ష నవంబర్లో జరగాల్సి ఉంది. కేంద్రం దీన్ని కారణంగా చూపగా.. సుప్రీం ధర్మాసనం.. మిగతా అధికారులందరూ అసమర్థులని అంటున్నారా అని ప్రశ్నించింది.
దీంతో ఏ అధికారి అనివార్యం కాదని, ప్రతి సంస్థకు నాయకత్వం ఉందని, కానీ కొనసాగింపు ఉండాలని కేంద్రం స్పందించింది. 2021 నుంచి ఆయన పొడిగింపులను చట్టవిరుద్ధంగా కొనసాగించినప్పటికీ, జూలై 31 వరకు కేంద్రానికి తాము సమయం ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. అయితే ఈసారి మాత్రం సెప్టెంబర్ 15 వరకూ ఈడీ ఛీఫ్ ను పదవిలో కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications