కేంద్రం వర్సెస్ డిల్లీ పోరు-సుప్రీంకోర్టు కీలక నిర్ణయం-రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ
జాతీయ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్లపై నియంత్రణ ఎవరికి ఉండాలనే దానిపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య పోరు కొనసాగుతోంది. దీనిపై నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు, ఉత్తర్వులతో రోజువారీ వారి విధులకు కూడా అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరు ఇవాళ కీలక మలుపు తీసుకుంది.
రాజధానిలో బ్యూరోక్రాట్లపై నియంత్రణ కోసం కేంద్రం, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరాటాన్ని సుప్రీంకోర్టు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. బ్యూరోక్రసీకి సంబంధించిన అధికారాల విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య పోరుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది.

ఈ ఉత్తర్వును ఓపెన్ కోర్టులో చదివిన సీజేఐ... 2018లో కోర్టు తీర్పులో ఇప్పటికే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య పరిష్కరించిన ఏవైనా ఇతర సమస్యలను కోర్టు మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలతో ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ సహాయం , సలహాకు కట్టుబడి ఉంటారని, ఇద్దరూ ఒకరితో ఒకరు సామరస్యపూర్వకంగా పనిచేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అరాచకానికి, నిరంకుశత్వానికి తావు లేదని పేర్కొంది. అయితే ఆ తీర్పును చదివిన ప్రధాన న్యాయమూర్తి రమణ, 2018లో ఇచ్చిన తీర్పు బ్యూరోక్రాట్ల సేవల విషయంలో ప్రత్యేకంగా వ్యవహరించలేదని గుర్తుచేశారు. దీంతో ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఆ అంశంపై దృష్టిసారించబోతోంది.
జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం బ్యూరోక్రాట్లపై నియంత్రణ లేని తన దుస్థితిని రాజ్యం లేని రాజులా పోల్చింది. ప్రజాస్వామ్య ప్రతినిధి అయిన ప్రభుత్వం ఆరోగ్య కార్యదర్శి లేదా వాణిజ్య కార్యదర్శిని నియమించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందవలసి ఉందని సుప్రీంకోర్టులో వాదించింది. 2018లో ఇచ్చిన తీర్పు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు సమిష్టిగా ఉన్నాయని స్పష్టం చేసింది












Click it and Unblock the Notifications