వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కీలక సమాచారం పంపడమా: రాజన్పై స్వామి మళ్లీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి ధ్వజమెత్తారు. ఆయన పైన ఆరు ఆరోపణలు ఉన్నాయని, వెంటనే ఆయనను ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీకి స్వామి లేఖ రాశారు.
ప్రధాని మోడీకి ఆయన పైన లేఖ రాయడం ఇది రెండోసారి. వడ్డీ రేట్లు పెంచడం, భద్రతలేని ఈ మెయిల్ వినియోగించడం, ఇష్టారీతి పాలసీలు.. వంటి ఆరు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆర్థికపరమైన కీలక సమాచారాన్ని కనీస భద్రత లేని చికాగో యూనివర్శిటీకి చెందిన ఈ మెయిల్ ఐడీ ద్వారా పంపిస్తున్నారన్నారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారత్లో అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, రాజన్ అమెరికాలో తన గ్రీన్ కార్డును పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్వామి ఆరోపణలు చేశారు. కాబట్టి ఆయనను వెంటనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలన్నారు.
Comments
subramanian swamy rbi governor raghuram rajan narendra modi సుబ్రహ్మణ్య స్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నరేంద్ర మోడీ
English summary
BJP MP Subramanian Swamy today fired another salvo at RBI Governor Raghuram Rajan levelling six allegations against him and asked Prime Minister Narendra Modi to immediately terminate his services.
Story first published: Thursday, May 26, 2016, 16:57 [IST]