స్విగ్గిలో ఇక నిత్యవసర వస్తువులు...! ఉప్పు, కారం కూడ అందిస్తాం...!
ఇన్నాళ్లు ఫుడ్ సర్వీసు అందిస్తున్న స్విగ్గి సంస్థ తాజాగా మరో వ్యాపారంలోకి దిగింది. ఇందులో భాగాంగనే పికప్ అండ్ డ్రాప్ సేవలను ప్రారంభించింది. వ్యక్తిగత ఇంటి పనులను కూడ చేసే సర్వీసులను అందించనుంది. ఇందు కోసం స్విగ్గి గో పేరుతో ఈ సేవలను అందిస్తున్నట్టు స్విగ్గి సంస్ధ ప్రకటించింది. ఇందులో భాగంగానే నిత్యవసర వస్తువులను సరఫరా చేయనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా నిత్యసవర వస్తువులైన పూలు,ఔషధాలు ఇతర వస్తువులను డెలివరి చేయనున్నట్టు సంస్థ తెలిపింది. అది కూడ గంటలోపే వాటిని సరఫర చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈ సేవలను మొత్తం దేశంలోని పట్టణాల్లో నాణ్యమైన సౌకర్యవంతమైన జీవీతాన్ని అందజేయడమే లక్ష్యమని ప్రకటించిన స్విగ్గి, కాగా ఈ సర్వీసును దేశంలోని 300 పట్టణాల్లో అందిస్తామని చెప్పారు. అయితే ముందుగా ఈ సేవలను 2020 నాటికి స్విగ్గీ గో సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకోసం బెంగళూర్లో 300 మంది వ్యాపారులు, హైదరాబాద్లో 200 మంది సంస్థలు స్విగ్గితో ఒప్పందం చేసుకుందని తెలిపారు. వీటిలో పలు పేరుమోసిన సంస్థలైన గోద్రేజ్, నేచర్ బాస్కెట్, రత్నదీప్ ,స్నేహా చికెన్ లాంటీ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications