తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వేతనాలు కట్, ప్రభుత్వ నిర్ణయం
తల్లిదండ్రుల బాగోగులను చూసుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేయనున్నట్టు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో అస్సాం ఆర్థికశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
అస్సాం: ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝళిపించనుంది.
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుండి కొంత మొత్తాన్ని కట్ చేసి వారి తల్లిదండ్రులకు అందించనున్నట్టు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.
అస్సాం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం నాడు బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.

ఈ విధాన్ని 2017..17 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయనున్నట్టు అస్సాం ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు.ప్రతి ఉద్యోగి తల్లిదండ్రుల బాధ్యతలను తీసుకోవాలని మంత్రి సూచించారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోలు చేసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకొని , ఉద్యోగుల వేతనం నుండి తల్లిదండ్రులకు చెల్లించనున్నట్టు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications