అవినీతిపై వీడియో పోస్ట్ చేసి ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
చెన్నై: పోలీసుశాఖలో అవినీతిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే శ్రీకాంత్ ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఎస్ఐ శ్రీకాంత్ కోయంబత్తూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
శ్రీకాంత్ జేశ్రీ తమిళనాడు ఫోర్త్ బెటాలియాన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోవైపుధుర్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్. అయితే పోలీస్ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. తాను కూడా బలవంతంగా కొన్ని లంచం ఫైళ్లపై బలవంతంగా సంతకాలు చేయాల్సి వచ్చిందని శ్రీకాంత్ ఫేస్బుక్ వీడియో ద్వారా ఆరోపించాడు.

దీంతో ఆయనపై కక్ష్యగట్టిన పై అధికారి తనను 15వ బెటాలియన్కు బదిలీ చేయించారని.. అన్ని వివరాలు వీడియో ద్వారా పేర్కొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆ వీడియో ప్రకారం.. 'రాష్ట్ర పోలీస్, రవాణా శాఖలలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇటీవల ఓ సీనియర్ అధికారి సుబ్రమణి రూ.15 వేలు లంచం తీసుకునేందుకు నాపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఓ ఫైలుపై సంతకం చేయించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫొటోల రూపంలో ఐజీగారికి పంపాను. కానీ నా ఫిర్యాదుపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేదు. పైగా నాపై బదిలీ వేటు వేశారు. నిజాయితీగా ఉండే తాను ఈ అవినీతిని భరించలేనని పేర్కొంటూ' ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది.
అవినీతికి ప్రోత్సహిస్తూ టార్గెట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు ఏదో మిశ్రమాన్ని తాగాడు. గమనించిన స్థానికులు ఎస్ఐని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఆత్మహత్యాయత్నం ఘటనతో నాలుక్కరుచుకున్న డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసి పూర్తి ఘటనపై విచారణ చేపట్టింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications