కిల్లర్ వీరప్పన్ ఎన్ కౌంటర్, దీపావళి ముందు రోజు, 17 ఏళ్లు, క్లూ ఇచ్చిన వ్యక్తితోనే ఫినిష్, స్కెచ్ !
దీపావళి ముందు రోజు కిల్లర్ వీరప్పన్ గుర్తుకు వచ్చాడుకోవర్టు సహాయంతో అంతం చేసిన తమిళనాడు, కర్ణాటక పోలీసులు17 ఏళ్ల తరువాత మళ్లీ వీరప్పన్ పేరు తెర మీదకు, పక్కా ప్లాన్ తో అంతం చేసిన పోలీసులు
చెన్నై/బెంగళూరు: స్మగ్లర్, కిల్లర్ వీరప్పన్ పేరు దీపావళి పండగ ముందు రోజు తమిళనాడు, కర్ణాటక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వేల సంఖ్యలో ఏనుగులను చంపేసి వాటి దంతాలు విక్రయిస్తూ అడ్డు వచ్చిన అటవి శాఖ అధికారులు, పోలీసులను అంతం చేసిన కిల్లర్ వీరప్పన్ అంతం అయ్యిన రోజును కొన్ని కోట్ల మంది గుర్తు చేసుకుంటున్నారు.
కన్నడ సినీరంగ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ను కొన్ని ఏళ్ల క్రితం కిల్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేశారు. అదే సమయంలో బెంగళూను నగరంలో కన్నడిగులు, తమిళ సోదరుల మద్య గొడవలు జరిగాయి. కర్ణాటకకు చెందిన ఓ మంత్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ ముఠా అతి దారుణంగా హత్య చేశారు.
కొన్ని సంవత్సరాల పాటు వీరప్పన్ కోసం వేటాడిన తమిళనాడు, కర్ణాటక పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. కిల్లర్ వీరప్పన్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని కోవర్టుగా మార్చుకున్నారు. అతని సహాయంతో కిల్లర్ వీరప్పన్ ను కళ్లకు చికిత్స చేయించుకోవాలి అంటూ అంబులెన్స్ లో అడవి నుంచి బయటకు తీసుకు వచ్చారు.
ఆ సందర్బంలో తమిళనాడులోని ఓ చెక్ పోస్టు సమీపంలో అంబులెన్స్ లో వస్తున్న కిల్లర్ వీరప్పన్ మీద తమిళనాడు, కర్ణాటక పోలీసులు గురి పెట్టారు. అంబులెన్ప్ ఆగిన వెంటనే తమిళనాడు, కర్ణాటక పోలీసులు తుపాకులతో గుళ్ల వర్షం కురిపించండంతో కిల్లర్ వీరప్పన్ తో పాటు ఆయన ముఖ్య అనుచరులు ముగ్గురు అంతం అయ్యారు. నేటితో కిల్లర్ వీరప్పర్ మరణించి 17 ఏళ్లు అవుతోంది.