చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం తాగి హోటల్ టెర్రాస్‌పై నుంచి పడి టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. చెన్నైలోని అన్నా సాలై హోటల్ టెర్రాస్‌పై నుంచి పడి 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మరణించాడు.

మృతుడిని పరమేశ్వరన్‌గా గుర్తించారు. ఎరోడ్‌కు చెందిన పరమేశ్వరన్ పూణేలోని ఐబిఎంలో పనిచేస్తున్నాడు. అతను ట్రిప్లికేన్‌లోని లాడ్జిలో బస చేశాడు. మంగళవారం రాత్రి అన్నా సాలైలోని రెయిన్ ట్రీ హోటల్‌కు వెళ్లాడు.

Techie dies after falling from hotel terrace in Chennai

పరమేశ్వరన్ హోటల్‌లో మద్యం సేవించి బిల్లు చెల్లించాడు. ఆ తర్వాత టెర్రాస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి కింద పడి మరణించాడు. పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. తైనామ్‌పేట పోలీసులు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

English summary
A 23-year-old software engineer died after falling from the terrace of a hotel on the Anna Salai in Chennai late on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X