లోక్ సభలో కలకలం, బీజేపీ ఎంపీ పాస్ లు ఎలా వచ్చాయి ?, 22 ఏళ్లకు సీన్ రిపీట్ కు స్కెచ్ ?
లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్ సభలోకి కొందరు దుండగులు చొరబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2001 డిసెంబర్ 13వ తేదీన లోక్ సభపై దాడి జరిగిన 22 ఏళ్ల తరువాత అదే రోజు లోక్ సభలోకి దుండగులు చొరబడటంతో ఎంపీలు హడలిపోయారు. దేశంలోని ఎక్కడాలేని కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్ సభలో ఇలాంటి సంఘటన జరడంతో ప్రపంచ దేశాలు ఢిల్లీ వైపు తిరిగిచూశాయి.
లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సందర్బంలో ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోని విజిటర్స్ గ్యాలరీలో నుంచి కిందకు దూకుతూ నినాదాలు చెయ్యడం, అదే సమయంలో మరో వ్యక్తి ఒక రకమైన రంగు పొగను వదలడంతో ఎంపీలు హడలిపోయారు. అదే సందర్బంలో లోక్ సభ బయట కూడా ఇద్దరు దుండగలు ఇదే తరహాలో ఆందోళనకు దిగి రంగు పొగను వదడం కలకలం రేపింది.

లోక్ సభలోకి చొరబడిన దండుగులను కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన డి. మనోరంజన్, సాగర్ శర్మగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఓ పోలీసు అధికారి ఆయన్ను కలిసి మీడియాకు చెప్పారు. ఢిల్లీ పోలీసులు అధికారికంగా వారి పేర్లు వెళ్లడించారు. మరో ఇద్దరు హరియానాలోని హిసార్ కు చెందిన నీలం (42), మహారాష్ట్రకు చెందిన అమోల్ షిందే (25)గా పోలీసులు గుర్తించామని పోలీసు అధికారులు అంటున్నారు.
కర్ణాటకలోని మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బంధువులు మేము అని చెప్పిన డి. మనోరంజన్, సాగర్ శర్మా లోక్ సభలోకి ప్రవేశించడానికి విజిటర్స్ పాస్ లు తీసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. వీరిలో మనోరంజన్ ఇంజనీర్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అయితే బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో దుండగులు పాస్ లు ఎలా తీసుకున్నారు ? అంటూ ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

లోక్ సభలో ఎంట్రీకి పాస్ లు తీసుకోవడం చాలా కష్టం. అయితే 2001 డిసెంబర్ 13వ తేదీని మళ్లీ గుర్తు చెయ్యడానికి ఈరోజు లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వడానికి పక్కాప్లాన్ తో పకడ్బందిగా దుండగులు లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వడానికి పాస్ లు తీసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎంపీ శిఫారస్సుతోనే ఇద్దరు దుండగులు లోక్ సభలోకి ప్రవేశించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
దండుగులను ఎంపీకి ఎవరైనా పరిచయం చేశారా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థ ఉన్న లోక్ సభలోకి వాయువును వెదజల్లే పరికరాలు తీసుకెళ్లడం కలకలం రేపింది. 2001 డిసెంబర్ 13వ తేదీన లోక్ సభలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 9 మంది వీరమరణం పొందిన విషయం తెలిసిందే. కచ్చితంగా 22 ఏళ్ల తరువాత అదే రోజు అంటే 2023 డిసెంబర్ 13వ తేదీన మరోసారి దుండగులు లోక్ సభలోకి ఇలా ప్రవేశించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications