Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల్లో అలా చేస్తే మీ ఇంటికే వచ్చి ఇస్తాము, ఐటీ హబ్ లో బంపర్ ఆఫర్, మంజునాథ్ రెడ్డి!

లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటుకోవాలని, కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలని ఉద్దేశంతో బీజేపీ, జేడీఎస్ కూటమి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా మరికొందరు నేతలు వారి తరపున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

బెంగళూరులో కాంగ్రెస్ ఎంపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రయత్నిస్తున్న వారికి మాజీ మేయర్ ఎన్.మంజునాథ్ రెడ్డి భారీ ఆఫర్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం శ్రమించే వారికే బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ తమ వార్డుల్లోని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చేలా సహకరించాలని కాంగ్రెస్ సూచించింది.

The Congress party is saying that it will give corporate seats if MP candidates win

బెంగళూరులో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో సహా పార్టీ సీనియర్‌ నేతలకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ మేయర్ ఎన్ మంజునాథ్ రెడ్డి ధృవీకరించారు. బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలకు బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.

బీబీఎంపీ పరిధిలోని వార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసే నాయకులకు బీబీఎంపీ ఎన్నికల టిక్కెట్టు దక్కేలా దోహదపడతాయని తెలియజేసారు.మాజీ మేయర్ గంగాంబికే మల్లికార్జున్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ బలోపేతానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీనుంచి బీబీఎంపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు బెంగళూరు నగరంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలను పోటీగా పని చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

ఇది మంచి నిర్ణయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బీబీఎంపీ ఎన్నికల కోసం బెంగళూరు నగరంలో కొంతమంది నమ్మకమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరించారు. ఇది అసంతృప్తికి కారణమైంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అన్నారు. రాజాజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జి పద్మావతి ఆమె నివాసం ఉంటున్న ప్రకాష్‌నగర్ వార్డులో కూడా కష్టపడి పనిచేశారు. కరోనా సమయంలో ప్రజలకు ఆమె సహాయం చేశారు.

అయితే పార్టీ నాయకులు ఆమెను పట్టించుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుట్టణ్ణకు పార్టీ టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ, బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న వారు ఇలాంటి పరిణామాలతో పని చెయ్యడానికి, డబ్బులు ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. వార్డుల విభజన, కోటా ఖరారు కారణంగా 2020 నుంచి బీబీఎంపీ ఎన్నికలు జరగలేదు. గత ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీబీఎంపీ ఎన్నికలను ఆగస్టులోగా నిర్వహించేందుకు కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+