జయలలిత కేసు: సుప్రీంను ఆశ్రయించిన డీఎంకే
న్యూఢిల్లీ/చెన్నయ్: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలితకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తమిళనాడులో రాజకీయ శత్రువు అయిన డీఎంకే పార్టీ జయలలిత కేసు విషయంలో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి ఆ కేసును కొట్టి వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పును రద్దు చెయ్యాలని డీఎంకే పార్టీ సుప్రీం కోర్టులో సోమవారం అర్జీ సమర్పించింది.

అంతకు ముందు సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితకు విధించిన శిక్షను అమలు చెయ్యాలని మనవి చేశారు. ఇప్పటికే కర్ణాటక హై కోర్టు తీర్పును ప్రశ్నిస్తు కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి జయలలిత మీద ప్రతీకారం తీర్చుకోవడానికి డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. అక్రమాస్తుల కేసు విషయంలో శిక్షపడిన తరువాత జయలలిత సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాత శిక్ష రద్దు కావడంతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ఇటివల ఆర్ కే నగర ఉప ఎన్నికలలో జయలలిత ఘన విజయం సాదించిన విషయం తెలిసిందే.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications