బిజెపి పతనం ప్రారంభమైంది, ఆ మూడు రాష్ట్రాల్లో విజయం మాదే: సల్మాన్ ఖుర్షీద్
న్యూఢిల్లీ: బిజెపి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. 2014 లో అధికారంలోకి వచ్చే సమయంలో ఉన్న ఆదరణ బిజెపికి లేదన్నారు.
దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. బిజెపి హయంలో దేశ వ్యాప్తంగా పలు కుంభకోణాలు వెలుగు చూసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2019లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనే లేవన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు బిజెపికి అత్యంత క్లిష్టమైనవిగా ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో సామాజిక అశాంతి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలు,దళితులపై బీజేపీ సాగిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆయా వర్గాలు నిరసనలతో ముందుకొస్తున్నాయన్నారు. దళితుల నిరసనలు దేశం దృష్టిని ఆకర్షించాయని ఆయన ప్రస్తావించారు.
బిజెపి ప్రతిష్ట మసకబారుతోందని సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ ధీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉందని సల్మాన్ ఖుర్షీద్ ధీమాను వ్యక్తం చేశారు.
ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆయన చెప్పారు.2019 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మేరకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications