నీ మొగుడు ప్రాణాలతో ఉండాలంటే ఇలా చెయ్, డెడ్ లైన్ పెట్టిన కిలాడీ లేడీ, భర్త కళ్లముందే ?
ఐటీ హబ్ లో మోసగాళ్లు ఉంటారు అనే మాట నిజం అని చెప్పడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. పూజల నెపంతో బుడుబుడకల మహిళ బంగారం దోచుకుని పారిపోయిన ఘటన బెంగళూరులోని కొత్తనూరు సమీపంలోని దొడ్డ గుబ్బిలో చోటుచేసుకుంది. శకుంతల అనే మహిళ మోసపోయి ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. నీ భర్తకు ప్రమాదం పొంచి ఉంది అంటూ శకుంతలకు ఆ మోసగత్తె చెప్పింది.
నీ భర్త 9 రోజుల్లో చనిపోతాడని, నీ భర్తకు ప్రాణగండం ఉందని, నువ్వు పసుపుకుంకుమలతో జీవితాంతం జీవించాలని ఆశపడుతున్నావని, కానీ అలా జరగదని ఆ మంత్రగత్తె శంకుతలను భయభంత్రులకు గురి చేసింది. పీ భర్త జీవించాలంటే నువ్వు వెంటనే నేను చెప్పినట్లు ప్రత్యేక పూజలు చేయాలని ఆ బుడబుడికి మహిళ శంకుతలను నమ్మించింది. శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లో నీ భర్త చనిపోతాడని ఆమె శకుంతలను బయపెట్టింది.

భయాంధళలనకు గురైన శకుంతల బుడుబుడకల మహిళ చెప్పినట్లు పూజలు చెయ్యడానికి వెంటనే సిద్ధమైంది. పూజ చేయాలంటే నేను ఇచ్చే కుండలో బంగారాన్ని పెట్టమని శకుంతలకు సూచించింది. శంకుతల ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, బంగారు నగలు కుండలో పెట్టింది. బంగారు నగల మీద పసుపు, కుంకుమ చల్లిన మంత్రగత్తె తరువాత కొన్ని మంత్రాలు చదివింది. ఆతర్వాత కళ్లు మూసుకుని కూర్చోవాలని శకుంతలకు ఆమె సూచించింది. బుడుబుడికి మహిళ చెప్పినట్లు కుండలో బంగారం పెట్టిన శంకుతల కళ్ల మూసుకుని ఆ కుండ ముందే కుర్చుంది.

తరువాత కొన్ని మంత్రాలు వేసిన బుడబుడికి మహిళ నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాతే కుండలోంచి బంగారాన్ని బయటకు తీయాలని, నువ్వు అంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలని సలహా ఇచ్చిన మోసగత్తె కుండలో ఉన్న బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. భర్త కోసం కళ్లు మూసుకుని ఎదురుచూసిన శకుంతల చాలా సేపు ధ్యానం చేస్తూనే ఉంది. సాయంత్రం ఇంటికి భర్త వచ్చిన తరువాత శకుంతల ఆ కుండ తెరిచి చూడగా అందులో బంగారు నగలు మాయం అయిన విషయం గుర్తించి లబోదిబో అంది.
తాను మోసపోయానని గుర్తించిన శకుంతల షాక్కు గురైంది. బాధితురాలు శకుంతల ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటనపై కొత్తనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈశాన్య డివిజన్ డీసీపీ లక్ష్మీప్రసాద్ స్పందిస్తూ శకుంతల అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బుడబుడికి మహిళ నీ భర్తకు ప్రమాదం పొంచి ఉందని ఆమెను నమ్మించిందని, దాని పరిష్కారం కోసం ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పి బంగారు నగలు చోరీ చేసి మోసం చేసిందని, సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితురాలు విజయవాడ, వైజాగ్ ప్రాంతంలో మాట్లాడే తెలుగు, కన్నడ బాష మాట్లాడిందని బాధితురాలు చెబుతోందని తెలిసింది.
-
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications