నీ మొగుడు ప్రాణాలతో ఉండాలంటే ఇలా చెయ్, డెడ్ లైన్ పెట్టిన కిలాడీ లేడీ, భర్త కళ్లముందే ?
ఐటీ హబ్ లో మోసగాళ్లు ఉంటారు అనే మాట నిజం అని చెప్పడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. పూజల నెపంతో బుడుబుడకల మహిళ బంగారం దోచుకుని పారిపోయిన ఘటన బెంగళూరులోని కొత్తనూరు సమీపంలోని దొడ్డ గుబ్బిలో చోటుచేసుకుంది. శకుంతల అనే మహిళ మోసపోయి ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. నీ భర్తకు ప్రమాదం పొంచి ఉంది అంటూ శకుంతలకు ఆ మోసగత్తె చెప్పింది.
నీ భర్త 9 రోజుల్లో చనిపోతాడని, నీ భర్తకు ప్రాణగండం ఉందని, నువ్వు పసుపుకుంకుమలతో జీవితాంతం జీవించాలని ఆశపడుతున్నావని, కానీ అలా జరగదని ఆ మంత్రగత్తె శంకుతలను భయభంత్రులకు గురి చేసింది. పీ భర్త జీవించాలంటే నువ్వు వెంటనే నేను చెప్పినట్లు ప్రత్యేక పూజలు చేయాలని ఆ బుడబుడికి మహిళ శంకుతలను నమ్మించింది. శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కేవలం తొమ్మిది రోజుల్లో నీ భర్త చనిపోతాడని ఆమె శకుంతలను బయపెట్టింది.

భయాంధళలనకు గురైన శకుంతల బుడుబుడకల మహిళ చెప్పినట్లు పూజలు చెయ్యడానికి వెంటనే సిద్ధమైంది. పూజ చేయాలంటే నేను ఇచ్చే కుండలో బంగారాన్ని పెట్టమని శకుంతలకు సూచించింది. శంకుతల ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, బంగారు నగలు కుండలో పెట్టింది. బంగారు నగల మీద పసుపు, కుంకుమ చల్లిన మంత్రగత్తె తరువాత కొన్ని మంత్రాలు చదివింది. ఆతర్వాత కళ్లు మూసుకుని కూర్చోవాలని శకుంతలకు ఆమె సూచించింది. బుడుబుడికి మహిళ చెప్పినట్లు కుండలో బంగారం పెట్టిన శంకుతల కళ్ల మూసుకుని ఆ కుండ ముందే కుర్చుంది.

తరువాత కొన్ని మంత్రాలు వేసిన బుడబుడికి మహిళ నీ భర్త ఇంటికి వచ్చిన తర్వాతే కుండలోంచి బంగారాన్ని బయటకు తీయాలని, నువ్వు అంత వరకు ధ్యానం చేస్తూనే ఉండాలని సలహా ఇచ్చిన మోసగత్తె కుండలో ఉన్న బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. భర్త కోసం కళ్లు మూసుకుని ఎదురుచూసిన శకుంతల చాలా సేపు ధ్యానం చేస్తూనే ఉంది. సాయంత్రం ఇంటికి భర్త వచ్చిన తరువాత శకుంతల ఆ కుండ తెరిచి చూడగా అందులో బంగారు నగలు మాయం అయిన విషయం గుర్తించి లబోదిబో అంది.
తాను మోసపోయానని గుర్తించిన శకుంతల షాక్కు గురైంది. బాధితురాలు శకుంతల ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటనపై కొత్తనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈశాన్య డివిజన్ డీసీపీ లక్ష్మీప్రసాద్ స్పందిస్తూ శకుంతల అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన బుడబుడికి మహిళ నీ భర్తకు ప్రమాదం పొంచి ఉందని ఆమెను నమ్మించిందని, దాని పరిష్కారం కోసం ప్రత్యేక పూజలు చేయించాలని చెప్పి బంగారు నగలు చోరీ చేసి మోసం చేసిందని, సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితురాలు విజయవాడ, వైజాగ్ ప్రాంతంలో మాట్లాడే తెలుగు, కన్నడ బాష మాట్లాడిందని బాధితురాలు చెబుతోందని తెలిసింది.
-
బెంగళూరుకు భారీ వరాల మూట- కర్ణాటక బడ్జెట్ హైలైట్స్ -
పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications