షాక్: జైల్లో శశికళకు ప్రాణహాని: అదనపు బలగాలతో భద్రత, ఎందుకంటే ?
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ప్రాణహాని ఉందని వెలుగు చూడటంతో జైళ్ల శాఖ అధికారులు ఆమెకు అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. శశికళ ఉంటున్న గది (సెల్) దగ్గర అదనపు పోలీసు బలగాలతో భద్రత కల్పిస్తున్నారు.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మహిళా ఖైదీలు ఉంటున్న మొదటి అంతస్తులోని శశికళ గది దగ్గర గురువారం మద్యాహ్నం నుంచి 10 మంది అదనపు మహిళా పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. శశికళ ప్రాణాలకు ఎలాంటిహాని ఎదురుకాకుండా చూస్తున్నామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

శశికళ మీద దాడి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయని తెలిసింది. అందువలన ముందు జాగ్రత్త చర్యగా శశికళకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని సమాచారం. పరప్పన అగ్రహార జైల్లో ఉన్న తమిళనాడుకు చెందిన ఖైదీల నుంచి శశికళ మీద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చారని తెలిసింది.
గతంలో జయలలిత పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన సమయంలో ఇలాంటి భద్రత కల్పించారు. జయలలితకు జడ్ ప్లస్ భద్రత ఉన్న కారణంగా అధికారులు అప్పట్లో జైల్లో కూడా ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. శశికళకు మాత్రం జడ్ ప్లస్ భద్రత లేదు. జైల్లో ప్రయివేటు సెక్యూరిటీని అనుమతించపోవడంతో అదనపు మహిళా పోలీసు బలగాలతో భధ్రత కల్పిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications