ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ జాబితాలో బీజేపీ సన్నిహితులే ఎక్కువగా ఉన్నారని.. అందుకే పార్లమెంటులో ఆ వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు.
'పార్లమెంటులో నేనో సాధారణ ప్రశ్న అడిగాను. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన 50 మంది డిఫాల్టర్ల పేర్లు వెల్లడించాలని కోరాను. కానీ ఆర్థికమంత్రి అందుకు సమాధానమిచ్చేందుకు తిరస్కరించారు. కానీ ఇప్పుడు నీరవ్ మోదీ,మెహుల్ చోక్సీ సహా ఇతర బీజేపీ సన్నిహిత నేతల పేర్లను ఆర్బీఐ జాబితాలో పెట్టింది. రుణ ఎగవేతదారులంతా తమ సన్నిహితులేనన్న విషయం ఎక్కడ బయటపడుతుందోననే బీజేపీ ఆ పేర్లను పార్లమెంటులో వెల్లడించలేదు.' అని రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టం(RTI) కింద సాకేత్ గోఖలే అనే కార్యకర్త పిటిషన్తో ఆర్బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందజేసింది. దీంతో బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదో అస్త్రంగా మారినట్టయింది. నీరవ్ మోదీ,మెహుల్ చోక్సీ,విజయ్ మాల్యా వంటి 50 మంది రుణ ఎగవేతదారులకు సంబంధించి రూ.68607కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించింది. వీరి రుణాలను ఎందుకు మాఫీ చేసిందో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ మోసపూరిత విధానాలను ఇది స్పష్టం చేస్తోందన్నారు.
Recommended Video
संसद में मैंने एक सीधा सा प्रश्न पूछा था- मुझे देश के 50 सबसे बड़े बैंक चोरों के नाम बताइए।
— Rahul Gandhi (@RahulGandhi) April 28, 2020
वित्तमंत्री ने जवाब देने से मना कर दिया।
अब RBI ने नीरव मोदी, मेहुल चोकसी सहित भाजपा के ‘मित्रों’ के नाम बैंक चोरों की लिस्ट में डाले हैं।
इसीलिए संसद में इस सच को छुपाया गया। pic.twitter.com/xVAkxrxyVM
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications