యూజర్ల డేటా దొంగతనం: యూసీ బ్రౌజర్పై నిషేధానికి కేంద్రం రెఢీ?
భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది.
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది. ఈ తరుణంలో యూసీ బ్రౌజర్ వినియోగదారుల డేటాను సేకరిస్తోందనే సమాచారంపై కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది.
డేటా దొంగతనానికి పాల్పడుతున్నారంటూ చైనా కంపెనీలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి వెబ్పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాదికారి ఒకరు తెలిపారు.
యూసీ బ్రౌజర్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి తెలిపారు. చైనాలోని సర్వర్లకు భారత్ యూజర్ల మొబైల్ డేటాను పంపిస్తోందని.....ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నామని ఆ అధికారి తెలిపారు.
యూసీ బ్రౌజర్కు భారత్లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్లకు పైనే ఉన్నాయి. గ్లోబల్గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ .
యూసీ బ్రౌజర్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్లో మార్కెట్ షేరు 48.7 శాతమైతే యూసీ వెబ్ సెక్యూరిటీని ప్రైవసీని చాలా సీరియస్గా పరిగణణలోకి తీసుకొంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.
యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటు చేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్దతని చెప్పారు.తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేయడం లేదన్నారు.
యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకొంటుంది.యూజర్ల సమాచారాన్ని డేటాను సేకరించడం ఇండస్ట్రీ పద్దతిలో భాగమంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడుతామని ప్రకటించింది.
-
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications