జార్ఖండ్లో ఘోర ప్రమాదం: రైలు దూసుకెళ్లడంతో 12 మంది మృతి, పలువురికి గాయాలు
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.
అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

'జామ్తారాలోని కలాఝరియా రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కొన్ని మరణాలు నివేదించబడ్డాయి. ఖచ్చితమైన మరణాల సంఖ్య తరువాత నిర్ధారించబడుతుంది. వైద్య బృందాలు, అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి' అని జమ్తారా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
#WATCH | Jharkhand: On Jamtara train accident, Anant Kumar, SDM Jamtara says, "...Two bodies have been recovered. We've requested Railways to start a helpline number...The reason will be known after investigation..." pic.twitter.com/KZYz7cmI2w
— ANI (@ANI) February 28, 2024
జమతారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఘటనా స్థలానికి బయలుదేరుతున్నాను. ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాను. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. మృతులను ఇంకా గుర్తించలేదు అని తెలిపారు.
కాగా, జంతారా జిల్లాలోని కల్జారియా ప్రాంతంలో కొంతమంది ప్రయాణికులు రాంగ్ సైడ్ నుంచి రైలు నుంచి దిగడం వల్ల ప్రమాదం జరిగిందని మొదట జంతారా సబ్ డివిజన్ పోలీసు అధికారి (SDPO) రెహమాన్ తెలిపారు. 'ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను వెలికితీశారు. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది' అని చెప్పారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications