వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో భూ ప్రకంపనలు: ఆఫ్ఘనిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ కాశ్మీర్, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో ఉంది.

కాగా, దేశ రాజధానిలో ప్రకంపనలు రావడం వారంలో ఇది రెండోసారి. ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. నివాసాలు, కార్యాలయాల నుంచి బయటకి పరుగులు తీశారు. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది.

 Tremors felt in Delhi, NCR and JK after 5.8 magnitude earthquake hits Afghanistan

జనవరి 1న, తెల్లవారుజామున ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో రిక్టార్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కేంద్రం నుంచి వచ్చిన రీడింగుల ప్రకారం.. భూకంపం 3.8గా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్‌కు ఉత్తర వాయువ్య దిశలో తెల్లవారుజామున 1:19 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం లోతు భూమికి 5 కి.మీగా ఉంది.

English summary
Tremors felt in Delhi after 5.8 magnitude earthquake hits Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X