‘పోప్’లేం కాదు: ఎలక్ట్రానిక్ మీడియాపై సుప్రీం ఆగ్రహం, వార్నింగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవాస్తవాలు, నిరాధారమైన పరోక్ష నిందలను ప్రచురించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. టీవీ మీడియా, వెబ్సైట్లు తమను తాము చర్చి బోధకుడి వేదికపైనున్న పోప్గా భావించకూడదని స్పష్టం చేసింది.
బాధ్యతాయుతమైన పాత్రికేయానికి ఉన్న ప్రాధాన్యాన్ని నొక్కివక్కాణించింది. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ హెచ్చరిక చేసింది.

మీడియా గొంతు నొక్కే ప్రసక్తే ఎన్నటికీ రాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలన్నిటినీ తాను స్వయంగా తిరస్కరించినట్లు తెలిపారు. మీడియా, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తమకు వెబ్సైట్లు ఉన్నాయని దేనిని పడితే దానిని ప్రచురించరాదని తేల్చి చెప్పారు. దేనినైనా రాసేసి, దానిని వెబ్సైట్లో ప్రచురించారన్న కారణంతో తప్పించుకోవడం పాత్రికేయ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. మనసుకి ఏది తోస్తే దానిని రాసేయకూడదని వివరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications