కోల్కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి...
కోల్కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పరిస్థితిని సమీక్షించేదుకు వెంటనే సమావేశం కావాలని డీజీపీతోపాటు రాష్ట్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
పశ్చిమ బెంగాల్లోని నార్త్ కోల్కతా జిల్లాలైన భత్పారా జిల్లాలో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య దాడులు కొనసాగాయి. ఇందులో రోడ్డు పక్కన పాని పూరి అమ్ముకునే ఒక యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరోకరు ఆసుపత్రిలో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.
Recommended Video
కాగా రెండు గ్రూపుల మధ్య ఘర్షనను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు బాష్పవాయిువు గోళాలతోపాటు గ్యాస్ షెల్స్ ఉపయోగించినట్టు తెలుస్తుంది.వాటితోపాటు గాల్లోకి కాల్పులు కూడ జరిపినట్టు సమాచారం ,కాగా సంఘటన జరిగిన కొద్ది సేపటి క్రితమే బెంగాల్ డీజీపీ నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ప్రారంభించారు. డీజీపీ వెళ్లిన కాసేపటికే అల్లర్లు చెలరేగాయి.కాగా ఇవి మతపరమైన అల్లర్లుగా స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.