విజయ్ మాల్యాను అప్పటివరకూ అప్పగించం- భారత్కు తేల్చిచెప్పిన బ్రిటన్
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్మాల్యాను త్వరలో భారత్కు తిరిగి తీసుకొస్తామంటూ నిన్న మొన్నటి వరకూ లీకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. విజయ్ మాల్యాను అప్పగించడం కుదరదని బ్రిటన్ తమకు చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇవాళ చావు కబురు చల్లగా చెప్పింది.
రహస్యమైన న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే వరకూ భారత్కు మాల్యాను అప్పగించలేమంటూ బ్రిటన్ భారత్కు తేల్చిచెప్పింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు బ్రిటన్ తమకు పంపిన లేఖను కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది చదివి వినిపించారు. ఇందులో తదుపరి న్యాయపరమైన అంశాలు పరిష్కారం అయ్యేవరకూ మాల్యాను అప్పగించడం కుదరదని బ్రిటన్ వెల్లడించింది.

ఈ రహస్య న్యాయపరమైన అంశం ఏమిటో, అది ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో కూడా బ్రిటన్ అందులో వెల్లడించలేదు. కానీ మాల్యా వ్యవహారం భారత్కు ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసంటూ సన్నాయి నొక్కులు మాత్రం నొక్కింది. సాధ్యమైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రయత్నిస్తామని బ్రిటన్ చెప్పినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అనంతరం మాల్యాను భారత్ రప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అటార్నీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.
-
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications