Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి యువతి గ్యాంగ్ రేప్

UP: Girl gangraped in Azamgarh
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. ఓ దళిత టీనేజ్ బాలిక పైన నలుగురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అజంఘర్ జిల్లాలోని సరయిమీరా ప్రాంతంలో జరిగిందని పోలీసులు శుక్రవారం చెప్పారు.

ఈ దారుణ సంఘటన గత రాత్రి జరిగింది. రోడ్డు పైన వెళ్తున్న పదిహేడేళ్ల బాలికను నలుగురు యువకులు పట్టుకొని, ఆమెపై దగ్గర్లోని పొలాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారని పోలీసులు చెప్పారు.

నిందితులను గుర్తించినట్లుగా పోలీసులు చెప్పారు. నిందితులు ముఖేష్, అరవింద్, విక్రమ్, దుర్గేష్‍లు అన్నారు. సంఘటన అనంతరం నలుగురు కూడా పారిపోయారన్నారు.

ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల కోసం తాము గాలిస్తున్నామన్నారు. కాగా, ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసిన సంఘటన తర్వాత ఈ ఘటన వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+