దారుణం: బహిర్భుమికి వెళుతున్న అక్కాచెల్లెళ్లను.. పొదల్లోకి లాక్కెళ్లి...
ఉత్తర్ ప్రదేశ్లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మరో దారుణం వెలగుచూసింది.
షహజన్పూర్: ఉత్తర్ ప్రదేశ్లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా మరో దారుణం వెలగుచూసింది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గుర్తుతెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ సంఘటన షహజన్పూర్ జిల్లాలోని బన్నునగరియా గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా గురువారం పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చింది. 17, 15 సంవత్సరాల వయసున్న గ్రామానికి చెందిన మైనర్ బాలికలు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో బహిర్భుమికి బయలుదేరారు.

అదే సమయంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు వారిని అడ్గగించి బలవంతంగా వారిని పొదల్లోకి లాక్కెళ్లారు. బాలికలిద్దరూ వారిని ప్రతిఘటించడానికి యత్నించగా.. దుండగులు వారిని తీవ్రంగా కొట్టారు.
అనంతరం వారిపై సాముహిక అత్యాచారానికి పాల్పడి వారిని అక్కడే వదిలి పరారయ్యారు. కాసేపటికి ఇంటికి చేరిన బాధితులు జరిగిన ఘాతుకంపై తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుల దాడిలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని మద్నాపూర్ ఎస్హెచ్వో ఓం ప్రకాశ్ గౌతం తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications