యోగీ సొంతగడ్డపై రేపు యూపీ ఎన్నికల ఆరోదశ- బీఎస్పీ ఓట్ల చీలికపైనే బీజేపీ ఆశలు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది.ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తి కాగా.. ఇందులో బీజేపీ, ఎస్పీ మధ్య హోరా హోరీ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్ పూర్ సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగబోతోంది. దీంతో ఈ దశ బీజేపీతో పాటు యోగీకి కీలకంగా మారింది.
పశ్చిమ యూపీలో మొదలైన అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పూర్వాంచల్ గా పేర్కొనే తూర్పు యూపీలో అడుగుపెట్టాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్పూర్ తో పాటు దాని చుట్టు పక్కల నియోజకవర్గాలు ఈ దశలో పోలింగ్ కు సిద్ధమయ్యాయి. . సాంప్రదాయకంగా దళిత, వెనుకబడిన కుల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీఎస్పీ ప్రభావం కూడా ఎక్కువే. దీంతో బీఎస్పీ సాయంతో తాము ఆధిక్యం ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో వరుస ఎదురుదెబ్బలు తగిలినా, బీఎస్పీ సోషల్ ఇంజినీరింగ్ ఇప్పటికీ ఇక్కడ సజీవంగానే ఉందనే అంచనాలున్నాయి.

Recommended Video
10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఆరోదశ పోలింగ్ లో బలరాంపూర్, సిద్ధార్థనగర్, మహరాజ్గంజ్, ఖుషీనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్, గోరఖ్పూర్, డియోరియా ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ తూర్పు యూపీ నియోజకవర్గాల్లో బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉండాలని బిజెపి కోరుకుంటోది. ఇప్పటివరకు బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్య ద్విముఖ పోరుగా సాగిపోతున్న ఎన్నికల్లో తొలిసారి బీఎస్పీ ప్రభావం ఉన్న ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇక్కడ ముక్కోణపు పోరును కాషాయ దళం కోరుకుంటోంది. ముక్కోణపు పోరు జరిగి బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోతే అది తమకు లాభిస్తుందని బీజేపీ అంచనా వేసుకుంటోంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications