కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్: నలుగురికి గాయాలు
కేదారనాథ్: భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఉత్తరాఖండ్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న పైలట్ తోపాటు నలుగురు గాయాలపాలయ్యారు.
ల్యాండింగ్ సమయంలో ఐరన్ గిర్డర్ను హెలికాప్టర్ బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్ను కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
#UPDATE Four people including the pilot suffered minor injuries after Indian Air Force's MI-17 helicopter caught fire following collision with an iron girder while landing at helipad near Kedarnath temple in Uttarakhand. (The helicopter is not of the Army as mentioned earlier) pic.twitter.com/l59bFVV4eP
— ANI (@ANI) April 3, 2018
ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఎంఐ-17 హెలికాప్టర్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.