Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్: నలుగురికి గాయాలు

కేదారనాథ్: భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న పైలట్ తోపాటు నలుగురు గాయాలపాలయ్యారు.

ల్యాండింగ్ సమయంలో ఐరన్ గిర్డర్‌ను హెలికాప్టర్ బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను కేదార్‌నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఎంఐ-17 హెలికాప్టర్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+