చార్ ధామ్ యాత్రీకులకు బిగ్ అలర్ట్..!!
Char Dham Yatra: దేశంలో చార్ ధామ్ యాత్ర సందడి కొనసాగుతోంది. దేవ భూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్లో వెలిసిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తోన్నారు. ప్యాకేజీ టూర్లకు డిమాండ్ ఏర్పడింది.
ఉత్తరాఖండ్లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. భక్తుల కోసం ఆయా ఆలయాలన్నీ తెరచుకున్నాయి. ఈ నెల 10వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 12వ తేదీన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను భక్తుల సందర్శనార్థం తెరిచారు.

మళ్లీ శీతాకాలం ఆరంభ సమయంలో అంటే నవంబర్ 12వ తేదీన గంగోత్రి, యమునోత్రి, 14వ తేదీన కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మూతపడతాయి. విపరీతమైన మంచు పడటం, ప్రతికూల వాతావరణం వల్ల సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఆయా ఆలయాల్లో భక్తులకు అనుమతి ఉంటుంది.
తొలి వారం రోజుల వ్యవధిలో 3,34,732 మంది భక్తులు చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకున్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. దీనితో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
వీఐపీల దర్శనంపై విధించిన నిషేధాన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడంపైనే తాము ప్రస్తుతం దృష్టి సారించామని, వీఐపీల రాక వల్ల ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు.
అలాగే- గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని నిషేధించినట్లు తెలిపారు. వీడియోలు తీయడంపైనా నిషేధం జారీ చేసినట్లు వెల్లడించారు. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు ఉన్నట్లు చెప్పారు.
చార్ ధామ్ యాత్రపై ఉద్దేశపూరకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications