Vande Bharat Express : ఈసారి ఆవును గుద్దేసిన రైలు- మళ్లీ పగిలిన మూతి-గుజరాత్ లోనే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ సెమీ హైస్పీడ్ రైళ్లు భారత్ లో పరిస్ధితులకు ఫిట్ కావడం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే గుజరాత్ లోనే పలు రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖకు స్ధానిక పరిస్దితులు షాకిస్తున్నాయి. గుజరాత్ లోని అతుల్ లో ఇవాళ మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.
గాంధీనగర్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు అతుల్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. అడ్డంగా వచ్చిన ఓ ఆవును రైలు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవు చనిపోగా.. రైలు ముందు భారం తీవ్రంగా దెబ్బతింది. దీంతో దెబ్బతిన్న రైలు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నడుస్తున్న నాలుగు రైళ్లలో మూడు ప్రమాదాలకు గురయ్యాయి. గత నెల రోజుల వ్యవధిలో జరిగిన మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం ఇది. దీంతో వందే భారత్ రైళ్లలో ప్రయాణ భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అతుల్ స్టేషన్ వద్ద ఆవును గుద్దేసిన తర్వాత 15 నిమిషాల పాటు అక్కడే రైలును నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ట్రాక్ క్లియర్ చేసి రైలును పంపారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రైల్వే ట్రాక్ లపై ఆవుల్ని, గేదెల్ని ఆపలేమని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే రైలును డిజైన్ చేసినట్లు తెలిపారు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే 160 కిలోమీటర్ల వేగం అందుకునేలా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారుచేసారు.
गुजरात में वलसाड के पास वंदे भारत से मवेशी टकरा गए। बोनट फिर से खुल गया। pic.twitter.com/Xnkkzs8Ir8
— Abhinav Pandey (@Abhinav_Pan) October 29, 2022
-
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమృత్ భారత్ రైలులో పురిటి నొప్పులు.. కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్ళేలోపే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్











Click it and Unblock the Notifications