దేశం గర్వించే బాల వీరులు.. 2025 బాల పురస్కార విజేతలు వీరే!
Veer Bal Diwas 2025: నేడు(డిసెంబర్ 26, 2025) 'వీర బాల దివస్' సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025' అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 20 మంది చిన్నారులను ఈ గౌరవం వరించింది. వీరిలో ఇద్దరు చిన్నారులకు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను రక్షించినందుకు గానూ మరణానంతర పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు.
పురస్కార గ్రహీతల వివరాలు, వారి సాహసగాథలు ఇవే:
1.బ్యోమా (మరణానంతరం) -తమిళనాడు(సాహసం)- కరెంట్ షాక్ తగులుతున్న 6 ఏళ్ల బాబును కాపాడుతూ తన ప్రాణాలు కోల్పోయింది.
2.కమలేష్ (మరణానంతరం)-బీహార్(సాహసం) -దుర్గావతి నదిలో మునిగిపోతున్న చిన్నారిని రక్షిస్తూ ప్రాణత్యాగం చేశాడు.

3. వైభవ్ సూర్యవంశీ- బీహార్(క్రీడలు)-14 ఏళ్ల వయసులోనే క్రికెట్లో రికార్డులు సృష్టించిన అద్భుత ప్రతిభాశాలి.
4. మహ్మద్ సిద్దన్- కేరళ(సాహసం) -విద్యుత్ షాక్ నుంచి తన ఇద్దరు స్నేహితులను ప్రాణాలతో కాపాడాడు.
5.అజయ్ రాజ్-ఉత్తరప్రదేశ్(సాహసం)-తండ్రిని పట్టుకున్న మొసలిపై ధైర్యంగా దాడి చేసి ఆయన ప్రాణాలను కాపాడాడు.
6. శ్రవణ్ -పంజాబ్(సామాజిక సేవ) -'ఆపరేషన్ సిందూర్' సమయంలో జవాన్లకు నిరంతరం సేవలు అందించాడు.
7. శివాని హోస్రు ఉప్పర -ఆంధ్రప్రదేశ్(క్రీడలు)- పారా అథ్లెటిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు దక్కింది.
8.అనుష్క-జార్ఖండ్(క్రీడలు)-ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నందుకు గౌరవించబడ్డారు.
9.వాకా లక్ష్మి ప్రజ్ఞిక- గుజరాత్(క్రీడలు)-ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో 9కి 9 రౌండ్లు గెలిచి రికార్డు సృష్టించింది.
10. యోగితా మాండవి-ఛత్తీస్గఢ్(క్రీడలు)-నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చి జూడోలో నేషనల్ ప్లేయర్గా ఎదిగింది.
11.సుమన్ సర్కార్ -పశ్చిమ బెంగాల్(కళ-సంస్కృతి)-తబలా వాద్యకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో 43 పురస్కారాలు గెలుచుకున్నారు.
12. వంశ్-చండీగఢ్(సామాజిక సేవ) -నిరంతరం సమాజ సేవలో పాల్గొంటున్నందుకు గుర్తింపు.
13.పూజ-ఉత్తరప్రదేశ్(ఆవిష్కరణ)- కాలుష్యాన్ని నివారించేలా ప్రత్యేకమైన త్రెషర్ మిషన్ను రూపొందించింది.
14. అర్ణవ్ మహర్షి-మహారాష్ట్ర(సైన్స్ & ఇన్నోవేషన్)-కేంద్ర ప్రభుత్వం పేటెంట్ పొందిన ప్రత్యేక AI సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశాడు.
15.ఎస్తేర్ లాల్దుహవ్మి-మిజోరం(కళ-సంస్కృతి)-20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న చిన్నారి యూట్యూబర్, గాయని.
16.ఐషీ ప్రిషా బోరా -అస్సాం (పర్యావరణం)- విద్యుత్ అవసరం లేని పెన్సిల్ తయారీ మెషీన్, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ తయారు చేసింది.
ముఖ్య విశేషాలు:
వీర బాల దివస్: సిక్కుల పదో గురువు గోవింద్ సింగ్ నలుగురు కుమారుల (సాహిబ్జాదాలు) త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 26న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాహసం, కళ, సంస్కృతి, సైన్స్, పర్యావరణం, సామాజిక సేవ, క్రీడలు అనే 6 విభాగాల్లో ఈ అవార్డులు అందించారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది చిన్నారులు ఎంపికయ్యారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications