ఇప్పుడా: జయలలితపై ఖుష్బూ,విజయకాంత్ థ్యాంక్స్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరద సాయంలో జయ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. జనం గగ్గోలు పెడుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు.
జయలలిత సర్కార్ మరీ మందమతిగా ఉన్నదని ధ్వజమెత్తారు. చెన్నై నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసిన వారం తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందుకోసం వెంటనే ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు.

చెన్నై పట్టణంలో వరద బాధిత ప్రాంతాలను అసలు పట్టించుకోలేదన్నారు. నగరంలో ఏ మూలకు వెళ్లినా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారన్నారు. ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, అధికార పార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు.
కాగా, వరద బాధితులను ఆదుకున్న వారికి నటుడు, డిఎండికె అధ్యక్షులు విజయకాంత్ ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన వారికి, ఆపద సమయంలో ముందుండి సహకరించిన వారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల భారీ వర్షం, వరదలు చెన్నైని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications