వికసిత్ భారత్2047: వాయిస్ ఆఫ్ యూత్ ప్రారంభం: ప్రధాని మోడీ కీలక అడుగు!!
వికసిత్ భారత్ @ 2047 దార్శనికత సాకరం కోసం దేశ యువత ఆలోచనలను స్వీకరించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం ప్రారంభిస్తారు. దేశ ప్రధాని నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్@ 2047 వాయిస్ ఆఫ్ యూత్'ను ప్రారంభించనున్నారు.
వికసిత్ భారత్@ 2047 కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా రాజ్ భవన్ లలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లు, ఇన్స్టిట్యూట్ ల అధిపతులు, మరియు అధ్యాపక సభ్యులను ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ఇస్తారు. దేశాభ్యున్నతికి చెందిన ప్రణాళికలలో యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

భారత ప్రధాని తీసుకునే ఈ చొరవ ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొంది. భారతదేశానికి సంబంధించిన జాతీయ ప్రణాళికలు, ప్రాధాన్యతలు, మరియు లక్ష్యాల రూప కల్పనలో యువ తరాన్ని చురుగ్గా భాగస్వామ్యం తీసుకునేలా చేయటమే ప్రధాని మోడీ దార్శనికత అని పీఎంవో కార్యాలయం తెలిపింది.
ఇది యువత తమ సృజనాత్మక ఆలోచనలను దేశానికి అందించటానికి, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని మార్చటానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ వర్క్ షాప్ ల ద్వారా యువత తమ ఆలోచనలను దేశం కోసం పంచుకోవచ్చని పేర్కొంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వారి ఆలోచనలు మరియు సూచనలను పంచుకోవడానికి యువకులను నిమగ్నం చేసే ప్రక్రియను ప్రారంభించే దిశగా ఇది కీలక అడుగుగా చెప్తున్నారు.
దేశం కోసం యువత ఆలోచనలను తీసుకునే ఈ కొత్త కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వాలని, యువత దృష్టి ఈ కార్యక్రమం ద్వారా దేశంపైకి మారుతుందని చెప్తున్నారు. మొత్తానికి యువతను దేశ ప్రగతిలో భాగస్వామ్యం చేసే దిశగా మోడీ తీసుకున్న ఈ చొరవ మంచిది అన్న అభిప్రాయం దేశ ప్రజల నుండి కూడా వ్యక్తం అవుతుంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications