రాజభోగాలు మాయం... ఖైదీ దుస్తులతో సాధారణ ఖైదీల్లా శశి, ఇళవరసి!
జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళ సోమవారం ఒక్కసారిగా సాధారణ ఖైదీలా మారిపోయారు. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇద్దరూ ఖైదీలు ధరించిన దుస్తులు ధరించి మామూలు గదిలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది.
చెన్నై: అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళ సోమవారం ఒక్కసారిగా సాధారణ ఖైదీలా మారిపోయారు. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇద్దరూ ఖైదీలు ధరించిన దుస్తులు ధరించి మామూలు గదిలోనే ఉండిపోయారు.
మొన్నటి వరకు అనుభవించిన రాజభోగాలు, మృష్టాన్న భోజనానికి బదులు పులిహోర, పెరుగన్నం, సాంబారు, రాగి సంకటితో సరిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. శనివారం వరకు శశికళ జైలులోని ఓ అంతస్తులోని ఐదు గదుల్లో గడిపారు. సొంత ఇంట్లో ఉన్నట్టుగానే హల్చల్ చేశారు.

జైలులో ఆమె పొందుతున్న సౌకర్యాల గురించి డీఐజీ రూప మౌడ్గిల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సౌకర్యాల కోసం శశికళ కోట్లాది రూపాయలను జైలు సిబ్బందికి ముట్టజెప్పినట్టు రూప ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ మరునాడే అధికారులు రూపపై బదిలీ వేటు వేశారు.
మంగళవారం రూప మౌడ్గిల్ తన నూతన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులోని అక్రమాలను బయటపెట్టినందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ తనను అభినందించినట్టు తెలిపారు. డీఐజీ రూప బదిలీపై పోలీస్ డైరెక్టర్ జనరల్ రూప్ కుమార్ మాట్లాడుతూ రూపది బదిలీయే తప్ప శిక్ష కాదని పేర్కొనడం గమనార్హం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications