రేపటి వరకు ఆగండి, మా సత్తా చూపిస్తాం: కర్ణాటక బీజేపీ, రంగంలోకి దిగిన శ్రీరాములు
బెంగళూరు: శనివారం సాయంత్రం జరగనున్న ఫ్లోర్ టెస్టులో మేం మా బలం నిరూపించుకుంటామని బీజేపీ ప్రకటించింది. యడ్యూరప్ప విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ విభాగం ప్రకటన చేసింది. రేపటిలోగా మెజారిటీ నిరూపించుకోవాలని బీజేపీ నేత యడ్యూరప్పను సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే.
దీనిపై బీజేపీ కర్ణాటక విభాగం ట్విట్టర్లో స్పందించింది. బలపరీక్షలో నెగ్గుతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ప్రకటించింది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న విషయం వారికి తెలుసునని పేర్కొంది. అది రేపు ప్రపంచానికి తెలుస్తుందని చెప్పింది.
మా బలంపై సందేహం ఉన్న వారికి చెప్పేదొకటేనని, వేచి చూడండని పోస్టులో పేర్కొంది. ఆరు కోట్లమంది కన్నడిగుల ఆశీర్వచనాలు తమకు ఉన్నాయని తెలిపింది. వారి దీవెనలను గౌరవిస్తామని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తామని బీజేపీ కర్ణాటక విభాగం ప్రకటించింది.
Will discuss with Chief secretary and call for assembly session tomorrow. We are 100% confident that we will prove full majority: #Karnataka CM @BSYBJP on #SupremeCourt's order for floor test .https://t.co/sFnDSxVNRD pic.twitter.com/BrdDyIczjf
— Oneindia.com (@Oneindia) May 18, 2018
ఇదిలా ఉండగా, సుప్రీం తీర్పు నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు రంగంలోకి దిగారు. పావగడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వెంకటరమణప్పతో ఆయన మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. బీజేపీకి మద్దతు తెలపాలంటూ వెంకటరమణప్పను శ్రీరాములు కోరారని సమాచారం.
ఈ నేపథ్యంలో, వెంకటరమణప్పపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరమణప్పకు ముందు నుంచి కూడా గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులతో సత్సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రేపు ఫ్లోర్ టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.