Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు?

జనవరి 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం. ఆరోజే రిపబ్లిక్ డే ను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అమల్లోకి రావడంవల్లే దీన్ని జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయానికి రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయలేదు.

అందులో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని జనవరి 26వ తేదీన అమల్లోకి తెచ్చారు. 1930 జనవరి 26న తొలిసారిగా కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ఇచ్చింది. పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం అని అర్థం. దేశ చరిత్రలో దీన్ని ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణిస్తారు. ఆ తర్వాత 20 సంవత్సరాలకు జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకురావడంతో దాన్ని రిపబ్లిక్ నేషన్ గా పరిగణిస్తారు. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మువ్వన్నెల జెండాను ఊరూ వాడా ఎగరేస్తారు.

Why is Republic Day celebrated?

ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని నగరం ఢిల్లీ సుందరంగా ముస్తాబైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఫ్రెంచ్ దేశానికి చెందిన నాయకుడు గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం అనేది ఇది ఆరోసారి. గతేడాది జరిగిన వేడులకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరైన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+