రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు?
జనవరి 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం. ఆరోజే రిపబ్లిక్ డే ను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. భారత రాజ్యాంగం అమల్లోకి రావడంవల్లే దీన్ని జరుపుకుంటాం. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయానికి రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నప్పటికీ దాన్ని అమలు చేయలేదు.
అందులో కొన్ని మార్పు చేర్పులు చేసుకొని జనవరి 26వ తేదీన అమల్లోకి తెచ్చారు. 1930 జనవరి 26న తొలిసారిగా కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ నినాదాన్ని ఇచ్చింది. పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్ర్యం అని అర్థం. దేశ చరిత్రలో దీన్ని ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణిస్తారు. ఆ తర్వాత 20 సంవత్సరాలకు జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకురావడంతో దాన్ని రిపబ్లిక్ నేషన్ గా పరిగణిస్తారు. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. మువ్వన్నెల జెండాను ఊరూ వాడా ఎగరేస్తారు.

ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని నగరం ఢిల్లీ సుందరంగా ముస్తాబైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఫ్రెంచ్ దేశానికి చెందిన నాయకుడు గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం అనేది ఇది ఆరోసారి. గతేడాది జరిగిన వేడులకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరైన విషయం తెలిసిందే.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications