పనిమనిషి మృతి: పోలీసుల అదుపులో ఎంపి భార్య

గత పది నెలలుగా పని మనిషిని జాగృతి సింగ్ విపరీతంగా వేధిస్తోందని, హింసకు గురి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. పని మనిషి న్యూఢిల్లీలోని చాణక్యపురిలో గల ఎంపి భార్య నివాసంలో పని మనిషి అనుమానాస్పద స్థితిలో మరణించింది.
పని మనిషి తలపై, ఛాతీపై, కడుపులో, చేతులపై విపరీతంగా కొట్టినట్లు గుర్తులున్నాయని అంటున్నారు. భార్యతో విడాకుల కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, తాను వేరే నివాసంలో ఉంటున్నానని ఎంపి ధనంజయ్ సింగ్ చెప్పారు. పని మనిషి మృతి గురించి ఫోన్లో తన భార్య తనకు చెప్పిందని, ఆ సమయంలో తాను ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం జౌన్పూర్లో ఉన్నానని ఆయన చెప్పారు.
పని మనిషి సోమవారం ఉదయం మరణించగా, ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బయటకు చెప్పారు. తనకు విషయం తెలిసిన వెంటనే ఢిల్లీకి వచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు ఎంపి చెప్పారు. అమ్మాయి పది నెలలుగా తన భార్య వద్ద పనిచేస్తోందని ఆయన చెప్పారు












Click it and Unblock the Notifications