Wife: భార్యను ఇంట్లో చంపేసి, పెట్రోల్ పోసి అంటించి, ఆంటీ పైన దుప్పటి కప్పేసి, వీడు ఏమి శాడిస్టు !
ముంబాయి/ థానే/ చెన్నై: భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తున్న భర్తకు తరువాత సమస్యలు మొదలైనాయి. రెండు మూడు సంవత్సరాల నుంచి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఆంటీ, అంకుల్ మద్య పంచాయితీలు చెయ్యడానికి బంధువులు కూడా పెద్దగా ధైర్యం చెయ్యలేదు. దంపతుల మద్య రోజురోజుకు గొడవలు ఎక్కువైనాయి. రోజు ఉండే పాంచాయితీనే కదా అంటూ చుట్టుపక్కల వాళ్లు పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. వారం రోజుల నుంచి దంపతులు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు బంధువులకు అనుమానం వచ్చింది. అయినా వారు ఆ ఇంట్లోకి వెళ్లలేదు. ఇంటి నుంచి ఎక్కువగా దుర్వాసన రావడంతో బంధువులకు అనుమానం వచ్చింది. తలుపు లోపల లాక్ చెయ్యకుండా డోర్ మాత్రం ముందుకు వేసి ఉండటంతో నేరుగా వెళ్లి లోపల చూశారు. లోపల గదిలో భార్య హత్యకు గురై ఆమె శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్చి వేయడానికి ప్రయత్నించి పైన రెండు దప్పట్లు కప్పి ఉన్న విషయం గుర్తించిన బంధువులు షాక్ అయ్యారు. భార్య శరీరం కుళ్లిపోవడంతో దుర్వాసన వచ్చిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు .ఆంటీని హత్య చేసిన అంకుల్ మాత్రం రెండు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని జల్సాకు ఎక్కడికో చెక్కేశాడని పోలీసులు అంటున్నారు.

మొదట్లో హ్యాపీలైఫ్ గడిపిన దంపతులు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్లాస్ నగర్ లో సాహెబ్రావ్ నికల్టే, సుశీల (46) దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలు సాహెబ్రావ్, సుశీల దంపతులు సంతోషంగానే ఉన్నారని తెలిసింది. భార్య సుశీలతో కలిసి సంతోషంగా జీవిస్తున్న ఆమె భర్త సాహెబ్రావ్ కు తరువాత సమస్యలు మొదలైనాయి. రెండు మూడు సంవత్సరాల నుంచి సాహెబ్రావ్, సుశీల దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

దూరంగా ఉంటున్న దంపతులు
సుశీల ఆంటీ, సాహెబ్రావ్ అంకుల్ మద్య పంచాయితీలు చెయ్యడానికి ఇరు వర్గాలకు చెందిన బంధువులు కూడా పెద్దగా ధైర్యం చెయ్యలేదు. సుశీల, సాహెబ్రావ్ దంపతుల మద్య రోజురోజుకు గొడవలు మొదలైనాయి. సుశీల, సాహెబ్రావ్ ల మద్య రోజు ఉండే పాంచాయితీనే కదా అంటూ చుట్టుపక్కల వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారని తెలిసింది.

వారం రోజుల నుంచి అడ్రస్ లేరు
వారం రోజుల నుంచి సుశీల, సాహెబ్రావ్ దంపతులు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో సమీపంలో నివాసం ఉంటున్న ఇద్దరు బంధువులకు అనుమానం వచ్చింది. అయినా సుశీల, సాహెబ్రావ్ దంపతులను పట్టించుకుంటే మాకు లేనిపోని సమస్యలు వస్తాయి అంటూ భయపడి వారు ఆ ఇంట్లోకి వెళ్లలేదు. ఇంటి నుంచి ఎక్కువగా దుర్వాసన రావడంతో బంధువులకు అనుమానం వచ్చింది. తలుపు లోపల లాక్ చెయ్యకుండా డోర్ మాత్రం ముందుకు వేసి ఉండటంతో నేరుగా వెళ్లి లోపల చూశారు.

శవమై కనిపించిన భార్య
ఇంటి లోపల గదిలో భార్య సుశీల హత్యకు గురై ఆమె శరీరాన్ని పెట్రోల్ పోసి కాల్చి వేయడానికి ప్రయత్నించి పైన రెండు దప్పట్లు కప్పి ఉన్న విషయం గుర్తించిన బంధువులు షాక్ అయ్యారు. భార్య సుశీల శరీరం దాదాపుంగా కుళ్లిపోవడంతో దుర్వాసన వచ్చిందని గుర్తించిన బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .
Recommended Video

మాయం అయిపోయిన భర్త
సుశీలను ఆమె భర్త సాహెబ్రావ్ హత్య చేసి ఉంటాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సుశీలను దారుణంగా హత్య చేసిన తరువాత ఆమె శవం ఇంట్లోనే కాల్చి వేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, అది సాధ్యం కాకపోవడంతో కొంచెం కాలిపోయిన శవం మీద దుప్పట్లు కప్పేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అంటున్నారు. సుశీలను హత్య చేసిన సాహెబ్రావ్ అతని రెండు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో చెక్కేశాడని, అతని కోసం గాలిస్తున్నామని థానే జిల్లా పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications